బాలీవుడ్ కలిసి రాలేదు

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా చెలరేగిపోతున్న పూజ హెగ్డే ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాల్తో టాప్ లేపుతుంది. నిర్మాతలు కూడా పూజ హెగ్డే డిమాండ్ [more]

Update: 2019-10-29 06:53 GMT

టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా చెలరేగిపోతున్న పూజ హెగ్డే ఎన్టీఆర్, మహేష్, అల్లు అర్జున్, ప్రభాస్ సినిమాల్తో టాప్ లేపుతుంది. నిర్మాతలు కూడా పూజ హెగ్డే డిమాండ్ ని బట్టి పారితోషికం సమర్పిస్తున్నారు. టాలీవుడ్ లో లక్కీ హీరోయిన్ గా మెరిసిపోతున్న పూజ హెగ్డే కి బాలీవుడ్ మాత్రం కలిసి రావడం లేదు. బాలీవుడ్ లో అమ్మడు నటించిన సినిమాలన్నీ ఢమాల్ అంటున్నాయి. తెలుగులో డీజే కి ముందు హృతిక్ రోషన్ తో కలిసి చేసిన మోహింజదారో సినిమా అట్టర్ ప్లాప్ డిజాస్టర్ ని మూటగట్టుకుంది. ఇక ఇక్కడ డీజే తో అమ్మడు సుడి తిరిగి తెలుగులో టాప్ హీరోయిన్ అయ్యింది.

అబ్బో…. షాక్ తగిలింది

తెలుగు సినిమాల్తో బిజీ అయినా బాలీవుడ్ మీద ఓ కన్నేసి ఉంచుతున్న పూజ హెగ్డే కి అక్కడ మరోసారి గట్టి షాక్ తగిలింది. భారీ తారాగణంతో తెరకెక్కిన హౌస్ ఫుల్ 4 మొన్న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కామెడీ బేస్ మీద తెరకెక్కిన ఈ సినిమాలో పూజ హెగ్డే వన్ అఫ్ ద హీరోయిన్. అయితే సినిమా భారీ అంచనాల నడుమ విడుదలై భారీ ఓపెనింగ్స్ తెచ్చుకున్నప్పటికీ… డివైడ్ టాక్ వలన సినిమాకి కలెక్షన్స్ పడిపోవడం.. సినిమాకి ప్లాప్ టాక్ గట్టిగా పడిపోయింది. వెర్రి కామెడీ తో సినిమాని ప్రేక్షకులు ఎంజాయ్ చేయలేకపోతున్నారు. సినిమాకి గనక పాజిటివ్ టాక్ వస్తే.. 300 కోట్ల క్లబ్బులో నిలిచేదని, బ్యాడ్ టాక్ వలన భారీ డిజాస్టర్ అవ్వక తప్పదని.. ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి మోహింజదారో, హౌస్ ఫుల్ 4 డిజాస్టర్స్ తో పూజ హెగ్డే కి బాలీవుడ్ కలిసి రాలేదనే చెప్పాలి.

 

 

Tags:    

Similar News