15 రోజులకి రెండు కోట్లా..?

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ రేంజ్ లో దూసుకుపోతుంది బాలీవుడ్ భామ పూజ హెగ్డే. బాలీవుడ్ లో ఫెయిల్ అయినా.. టాలీవుడ్ ని దున్నేస్తున్న ఈ భామ [more]

Update: 2019-05-03 08:44 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ రేంజ్ లో దూసుకుపోతుంది బాలీవుడ్ భామ పూజ హెగ్డే. బాలీవుడ్ లో ఫెయిల్ అయినా.. టాలీవుడ్ ని దున్నేస్తున్న ఈ భామ అందినంత పుచ్చుకోవడం లేదు. డిమాండ్ చేసి మరీ నిర్మాతల నుండి పారితోషకాన్ని పిండుతుంది. పూజ నటించిన మహర్షి సినిమా విడుదలకు సిద్ధమయ్యింది. మహేష్ పక్కన అంటే స్టార్ హీరోయిన్ రేంజ్. ఇక ప్రభాస్ పక్కన కూడా హీరోయిన్ గా చేస్తోంది. తనని లక్కీ హీరోయిన్ గా మార్చిన అల్లు అర్జున్ పక్కన మరోసారి జోడి కడుతుంది. ఇక స్టార్ హీరోలే కాదు.. మీడియం రేంజ్ హీరోలతోనూ పూజ జోడి కట్టడానికి రెడీ అయ్యింది.

తప్పక ఒప్పుకున్న నిర్మాతలు

గతంలో వరుణ్ తేజ్ తో కలిసి ముకుంద సినిమాలో నటిస్తే.. తాజాగా వాల్మీకి సినిమాలో వరుణ్ సరసన నటించబోతుంది. ఇప్పటికే వాల్మీకి సెట్స్ లో జాయిన్ అయిన పూజ హెగ్డే… ఈ సినిమా కోసం భారీ పారితోషకం అందుకోబోతుందట. హరీష్ శంకర్ దర్శకత్వంలో తమిళ్ రీమేక్ గా ఈ వాల్మీకి సినిమా తెరకెక్కుతుంది. అధర్వ మురళి హీరోగా.. వరుణ్ తేజ్ నెగటివ్ పాత్ర చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాలో ముందు వేరే హీరోయిన్ అని అనుకున్నా చివరికి పూజ అయితే వరుణ్ కి సెట్ అవుతుందని ఆమెని సంప్రదించగా ఏకంగా 15 రోజుల కాల్షీట్స్ కోసం 2 కోట్లు డిమాండ్ చేసిందట. దీంతో ముందు దర్శకనిర్మాతలు షాకయినా… ఆమెకున్న క్రేజ్ కారణంగా 2 కోట్లు ఇవ్వడానికి ఒప్పుకున్నారనే న్యూస్ హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News