పూజ హెగ్డే లక్కు అలా కలిసొస్తుంది

బాలీవుడ్ లో పడుతూ లేస్తున్న పూజ హెగ్డే కి టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచేసింది. డీజే సినిమాతో లక్కు ను తొక్కిన పూజ హెగ్డే నిన్నటి అలా [more]

Update: 2020-01-18 05:46 GMT

బాలీవుడ్ లో పడుతూ లేస్తున్న పూజ హెగ్డే కి టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచేసింది. డీజే సినిమాతో లక్కు ను తొక్కిన పూజ హెగ్డే నిన్నటి అలా వైకుంఠపురములో వరకు.. సినిమాల మీద సినిమాలు చేస్తూ పిచ్చెక్కిస్తుంది. నిన్నటివరకు ఒక్క బ్లాక్ బస్టర్ పడకపోయినా.. పూజ క్రేజ్ పీక్స్ లో ఉంది. మరి అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ తో పూజ క్రేజ్ మరింతగా.. ఆకాశాన్ని తాకుతుంది. ఇప్పటికే పూజ స్టార్ హీరోలను చుట్టేస్తూ యంగ్ హీరోలతోనూ అదరగొట్టేస్తుంది. అరవింద సమేత యావరేజ్ అయినా.. వాల్మికీలో పూజ హెగ్డే ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ కావడం, అలా వైకుంఠపురముతో మల్లి బ్లాక్ కస్టర్ కొట్టడంతో పూజ హెగ్డే క్రేజ్ పీక్స్ కి వెళ్ళింది.

ఇక బాలీవుడ్ లోను హౌస్ ఫుల్ 4 యావరేజ్ టాక్ తో బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. దానితో పూజ హేగ్డ్ కి అక్కడ కూడా క్రేజ్ మొదలయ్యింది. మోహింజదారో తర్వాత పూజ హేగ్డ్ కి అవకాశాలు ఇవ్వాలంటే భయపడిన బాలీవుడ్ దర్శక నిర్మాతలు.. ఇప్పుడు ఆమె లక్కుని వాడుకోవాలని డిసైడ్ అయ్యారు. హౌస్ ఫుల్ 4 తరవాత పూజ హేగ్డ్ కి మరోసారి అక్షయ్ కుమార్ తన కొత్త సినిమాలో సెకండ్ హీరోయిన్ అవకాశం ఇచ్చాడనే టాక్ అందుతుంది. మరి ప్రస్తుతం బాలీవుడ్ లో వరస విజయలమీదున్న ఏకైక హీరో అక్షయ్ కూంర్. అలాంటి అక్షయ్ మళ్ళీ పిలిచి అవకాశం ఇవ్వడంతో పూజ హెగ్డే లక్కుని తొక్కిందంటున్నారు. మొదటి హీరోయిన్ గా కృతి సనన్ నటిస్తుండగా సెకండ్ హీరోయిన్ పాత్రలో ఈ పూజ హెగ్డే నటించబోతున్నట్లుగా తెలుస్తోంది. సెకండ్ అయినా పర్లేదు.. హిట్ హీరో కదా అని పూజ కూడా మారు మాట్లాడకుండా అక్షయ్ తో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.

Tags:    

Similar News