టాప్ రేంజ్ లో పూజా హెగ్డే..!

ప్రస్తుతం టాలీవుడ్ లో పూజా హెగ్డే టాప్ హీరోయిన్ గా మరిపోయింది. చేతిలో బ్లాక్ బస్టర్ హిట్ లేకపోయినా… టాప్ రేంజ్ పొజిషన్ లోనే పూజా హెగ్డే [more]

Update: 2019-02-27 10:40 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో పూజా హెగ్డే టాప్ హీరోయిన్ గా మరిపోయింది. చేతిలో బ్లాక్ బస్టర్ హిట్ లేకపోయినా… టాప్ రేంజ్ పొజిషన్ లోనే పూజా హెగ్డే ఉంది. ఏ స్టార్ హీరో చూసినా పూజా హెగ్డేనే కావాలనే స్టేజ్ లో పూజా గ్లామర్ ఉంది. అదురూబెదురూ లేకుండా దర్శక నిర్మాతలు ఎలా అంటే అలా అందాలు ఆరబోస్తూ అనుకోకుండా టాప్ రేంజ్ హీరోయిన్ అయ్యింది. అలాగే టాలీవుడ్ హీరోయిన్స్ కొరత కూడా పూజా హెగ్డేని టాప్ రేంజ్లో కూర్చోబెట్టింది. వరుసగా ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్ తాజాగా అల్లు అర్జున్ పక్కన కూడా పూజా హెగ్డేనే హీరోయిన్ అంటే పూజా అదృష్టం ఎలా ఉందో చూడండి.

భారీగా పారితోషకం…

మరి టాప్ రేంజ్ లో టాప్ హీరోస్ పక్కన నటిస్తున్న పూజా హెగ్డే పారితోషకం కూడా ఆ టాప్ లెవెల్లోనే ఉంటుంది. అందుకే ఒక్కో సినిమాకి పూజా హెగ్డే నిర్మాతల నుండి అక్షరాలా కోటి 75 లక్షల పారితోషకం డిమాండ్ చెయ్యడమే కాదు… నిర్మాతలు కూడా పూజా హెగ్డేకి అడిగింది కాదనకుండా ఇచ్చేస్తున్నారట. ప్రస్తుతం మహర్షి చిత్రానికే పూజా హెగ్డే కోటి 75 లక్షల పారితోషకం అందుకుంటున్నదని టాక్. అలాగే ప్రభాస్ – రాధాకృష్ణ సినిమాకి తాజాగా అల్లు అర్జున్ తో త్రివిక్రమ్ దర్శకత్వంలో చెయ్యబోయే సినిమాకి కూడా పూజా హెగ్డే కోటి 75 లక్షల పారితోషకం డిమాండ్ చేసినట్లుగా తెలుస్తుంది.

లక్కు బాగుంది…

మరి ప్రస్తుతం అంత ఎక్కువ పారితోషకాన్ని పూజా హెగ్డేకి నిర్మాతలే పిలిచి ఇస్తున్నారంటే అమ్మడు రేంజ్ ఏ లెవల్లో ఉందో అర్ధమవుతుంది. ఇదే సమయంలో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ గనుక పూజా చేతిలో ఉంటే.. ఆమె 2 కోట్లు పారితోషకం అందుకున్నా ఆశ్చర్యపోవక్కర్లేదు అంటున్నారు. ఏదైనా పూజా లక్కు బాగుంది కనుకనే ఒక రేంజ్ లో టాప్ పొజిషన్ లో కూర్చుంది.

Tags:    

Similar News