క్రేజ్ ఉంది కనకనే.. అడిగింది ఇస్తున్నారు

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోలందరిని చుట్టేస్తున్న భామ పూజ హెగ్డే. ఆమె కెరీర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ లేకపోయినా… లక్కున్న హీరోయిన్ గా [more]

Update: 2019-07-17 04:31 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోలందరిని చుట్టేస్తున్న భామ పూజ హెగ్డే. ఆమె కెరీర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ లేకపోయినా… లక్కున్న హీరోయిన్ గా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ కెరీర్ లో దున్నేస్తుంది. ఒక్క స్టార్ హీరో ఏం ఖర్మ.. తెలుగులో రామ్ చరణ్ తప్ప మిగతా హీరోలందరితో పూజ నటించేస్తుంది. ఎన్టీఆర్, మహేష్ తో జోడి కట్టిన పూజ తాజాగా ప్రభాస్, అల్లు అర్జున్ సినిమాల్తో బిజీగా వుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో క్రేజున్న ఏకైన హీరోయిన్ గా పూజ హెగ్డే నే కనబడుతుంది. మరి అలాంటి హీరోయిన్ ఏ సినిమాలో నటించినా ఆ సినిమాకి బోలెడంత క్రేజ్ వస్తుంది.

ఆ ఉద్దేశ్యంతోనే డీజే లో అల్లు అర్జున్ సరసన పూజ ని నటింపజేసిన దర్శకుడు హరీష్ శంకర్.. వరుణ్ తేజ్ వాల్మికీలో ఓ స్పెషల్ కేరెక్టర్ కి పూజ ని అడిగాడు. మరి డీజే తో లైఫ్ ఇచ్చిన డైరెక్టర్ గనక పూజ కూడా వాల్మీకి సినిమాలో వరుణ్ తేజ్ సరసన చెయ్యడానికి ఒప్పుకుంది. అయితే పూజ భారీ పారితోషకం డిమాండ్ చేసిందనే టాక్ ఎప్పటినుండో ప్రచారంలో ఉంది. ప్రచారం జరిగినట్టుగానే వాల్మికీలో ఓ పాట.. కొన్ని సీన్స్ కోసం పది రోజుల కాల్షీట్స్ ని హరీష్ శంకర్ కి కేటాయించిన పూజ.. ఆ పది రోజుల కాల్షీట్స్ కోసం కోటిన్నర డిమాండ్ చేసిందట. మరి క్రేజున్న హీరోయిన్ ఆయే.. అందులోనూ స్టార్ హీరోలతో బిజీగా ఉన్న పాప గనక వాల్మీకి నిర్మాతలు కూడా పూజ అడిగింది కాదనకుండా సమకూరుస్తున్నారట. అది కదా లెక్క… నిజంగా పూజ టైం అలా నడుస్తుంది అంతే..

Tags:    

Similar News