ఆ నిర్మాతలపై పేట నిర్మాత తీవ్ర వ్యాఖ్యలు

గత రెండు రోజులుగా థియేటర్ మాఫియా అంటూ నానా రచ్చ చేస్తున్న పేట డబ్బింగ్ హక్కులు కొన్న వల్లభనేని అశోక్ మరోసారి గీత దాటాడు. తప్పులన్నీ తమ [more]

Update: 2019-01-08 06:53 GMT

గత రెండు రోజులుగా థియేటర్ మాఫియా అంటూ నానా రచ్చ చేస్తున్న పేట డబ్బింగ్ హక్కులు కొన్న వల్లభనేని అశోక్ మరోసారి గీత దాటాడు. తప్పులన్నీ తమ దగ్గరే పెట్టుకుని.. తెలుగు నిర్మాతలను దుయ్యబడుతున్నాడు వల్లభనేని. ప్రత్యేకంగా దిల్ రాజు, అరవింద్, సురేష్ బాబు పేర్లను ఉచ్చరిస్తూ నానా రాద్ధాంతం చేస్తున్నాడు. మొన్నటికి మొన్న తమ పేట సినిమాకి థియేటర్స్ దొరకనివ్వని… దిల్ రాజు, అల్లు అరవింద్ లాంటి వాళ్లని షూట్ చేసి పారెయ్యాలని ఘాటైన వ్యాఖ్యలు చేసిన వల్లభనేని అశోక్ కి గీత ఆర్ట్స్ నుండి బన్నీ వాస్ కౌంటర్ ఇచ్చేసాడు. అంతేకాదు.. దిల్ రాజు తమ ఎఫ్ 2 సినిమా ప్రెస్ మీట్ లో తనకూ మట్లాడడం వచ్చని.. కానీ తనకు సంస్కారం ఉందని నేనూ వల్లభనేనిలా మాట్లాడను అంటూ సుతిమెత్తగా వల్లభనేని అశోక్ కి వార్నింగ్ ఇచ్చాడు. తమ సినిమాలు మూడు నెలల క్రితమే విడుదలకు డేట్స్ ప్రకటించామని, నిన్నగాక మొన్నొచ్చి పిచ్చి వాగుడు వాగొద్దంటూ హెచ్చరించాడు.

వారి కుటుంబసభ్యులపై తీవ్ర వ్యాఖ్యలు

అయినా వల్లభనేని పేట సినిమా కోసం థియేటర్స్ పై యుద్ధం చేస్తూనే ఉన్నాడు. గత రాత్రి ఒక ప్రముఖ ఛానల్ డిబేట్ లో పాల్గొన్న వల్లభనేని అశోక్ అన్ని హద్దులు దాటేశాడు. ఆ డిబేట్ లో వల్లభనేని అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబులను ఉద్దేశించి థియేటర్స్ ను మాఫియా చేసి డబ్బు సంపాదించే వాళ్ళు… మిగతా నిర్మాతల కుటుంబ సభ్యుల ఉసురు పోసుకునే బదులు అంటూ… దిల్ రాజు, అరవింద్ ల కుటుంబాలను తెరపైకి లాగడమే కాదు.. వారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మరి ఈ రకమైన మాటలతో తమ సినిమాకి ఫ్రీగా పబ్లిసిటీ చేసుకుందామని పేట నిర్మాత వల్లభనేని అశోక్ ప్లాన్ ఏమో గానీ.. ఆ మాటలు ఇప్పుడు ఇండస్ట్రీలో మంటలు రేపుతున్నాయి. చూద్దాం ఈ రచ్చ మరెంత దూరం వెళ్తుందో అనేది.

Tags:    

Similar News