'పెళ్లి చూపులు' తరువాత మళ్లీ ఇప్పుడే..!

Update: 2018-12-08 06:24 GMT

యూత్ ఐకాన్ విజయ్ దేవరకొండ మొదటి సినిమా 'పెళ్లి చూపులు' సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాదు విజయ్ తో పాటు హీరోయిన్ రీతువర్మ కి మంచి మార్కులు పడ్డాయి. ఈ సినిమా యూత్ తో పాటు.. ఫ్యామిలీ ప్రేక్షకులకి కూడా కనెక్ట్ అవ్వడంతో రీతూ వర్మ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సినిమాతో తెలుగులో ఆమెకు తిరుగు ఉండదు అని అంతా భావించారు. 'పెళ్లి చూపులు' తరువాత రీతూ నిఖిల్ తో 'కేశవ' సినిమా చేసింది కానీ అది అనుకున్న స్థాయిలో అయితే ఆడలేదు. దాంతో ఆమె తమిళ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టింది. తమిళంలో వీఐపి 2 లో నటించి విక్రమ్ లాంటి స్టార్ హీరోతో చేసే ఛాన్స్ కొట్టేసింది.

నాని సినిమాతో రీఎంట్రీ

ప్రస్తుతం ఆమె విక్రమ్ తో ఓ సినిమా చేస్తుంది. మళ్లీ చాలా కాలం తరువాత తెలుగులోకి రీఎంట్రీ ఇవ్వబోతుంది. విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో నాని ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ మూవీలో హీరోయిన్ రీతూ వర్మను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. రీసెంట్ గా ఆమెకు స్టోరీ చెప్పడం, ఆమె గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయంట. థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఈ సినిమా, ఫిబ్రవరి 19 నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది. రీతువర్మ మన తెలుగు అమ్మాయి అని తెలిసిందే.

Similar News