ఒళ్ళు తగ్గాలంటే… ఓ పూట తిండి మానెయ్యండి!!

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ ఇంటికే పరిమితమై.. ఇంట్లో రకరకాల వంటలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలు. ప్రజలేనా.. హీరో, హీరోయిన్స్ కూడా తల్లితండ్రులు వండిన వంటలకన్నా.. [more]

Update: 2020-06-28 15:28 GMT

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ ఇంటికే పరిమితమై.. ఇంట్లో రకరకాల వంటలను ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రజలు. ప్రజలేనా.. హీరో, హీరోయిన్స్ కూడా తల్లితండ్రులు వండిన వంటలకన్నా.. తమకి తాముగా కొత్త కొత్త వెరైటీలను ట్రై చేస్తున్నారు. రకుల్, సమంత లాంటివాళ్లు వండిన వంటలను తిని జిమ్ లో ఒళ్ళు కరిగించుకుంటున్నారు. కానీ కొంతమంది మాత్రం బాగా తిని కాస్త బరువు పెరిగారు. అందుకే అలాంటి వాళ్ళకోసం పాయల్ రాజపుట్ చిట్కాలు చెబుతుంది. RX 100 తో అందంగా మురిసిపోయిన  పాయల్ రాజ్ ఫుట్ ఆతర్వాత స్టార్ రేంజ్ అందుకోలేకపోయింది కానీ.. ఎప్పుడూ ఏదో ఒక సినిమాతో బిజినె. కెరీర్ మొదలు పెట్టాకా ఇన్నిరోజులు కుటుంబంతో గడపలేదని చెబుతున్న పాయల్ రాజపుట్.. లాక్ డౌన్ లో కాస్త ఎక్కువగా తిని ఒళ్ళు చేసిన వారికీ.. ఆ బరువు ఎలా తగ్గించుకోవాలో చిట్కాలు చెబుతుంది.

నేను కూడా లాక్ డౌన్ సమయంలో నచ్చినవాణ్ణి తినేసి కాస్త కండ పెంచి.. ఒళ్ళు చేశాను అని చెబుతుంది. ఆ ఒళ్ళు కరించుకోవడానికి రాత్రిపూట తినడం మానెయ్యమంటుంది పాయల్. రాత్రిపూట భోజనం మానేసి.. తేలికపాటి సూప్స్ అయినా.. జ్యూస్ లు అయినా తీసుకోండి. నేను కూడా అంతే. ఇంట్లోని పనులన్నీ నాకు నేనుగా చేసుకుంటున్నాను. దానితో పెద్దగా వర్కౌట్స్ చెయ్యకుండా ఒళ్ళు కరిగించుకోచ్చు. అందుకే ఎవరి పనులు వారు చేసుకోండి అని చెబుతుంది. మరి జిమ్ లు, వరౌట్స్ లేకుండా ఎవరిపనులు వారు చేసుకుని.. ఓ పూట భోజనం మానెయ్యమని చెబుతుంది పాయల్. మరి మనము పాటించేద్దామా పాయల్ సలహాలు.

Tags:    

Similar News