ఎవరు చెప్పారండి వాళ్లు విడిపోయారని...!

Update: 2018-07-02 06:54 GMT

సంక్రాంతికి భారీ బడ్జెట్ మూవీగా విడుదలై అట్టర్ ఫ్లాప్ అయిన అజ్ఞాతవాసి సినిమాతో బెస్ట్ ఫ్రెండ్స్ అయిన త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ లు విడిపోయారని... అందుకే ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి ఎక్కడా కనబడలేదని టాక్ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో నడిచింది. ఆ సినిమా వల్లే మంచి స్నేహితులైన వారి మధ్య అభిప్రాయ బేధాలొచ్చాయని కూడా ప్రచారం జరిగింది. మరి అలా ప్రచారం జరగడానికి అనేక కారణాలు కనిపించాయి కూడా. ఎప్పుడూ ఏ ఫంక్షన్ కి వెళ్లినా పవన్ కళ్యాణ్ తో కంపల్సరీ త్రివిక్రమ్ వెళ్లేవాడు. ఏ ఈవెంట్ కి వెళ్లనివ్వండి, ఏ మ్యారేజ్ కి వెళ్లనివ్వండి ఎక్కడికైనా ఇద్దరు కలిసికట్టుగా వెళ్లేవారు. అయితే అజ్ఞాతవాసి తర్వాత మళ్లీ ఇద్దరు కలిసి కనబడితే ఒట్టు.

కాదు మొర్రో అంటే వినరే..

అందుకే అందరూ పవన్ కళ్యాణ్ కి త్రివిక్రమ్ కి మధ్య చెడిందనే న్యూస్ స్ప్రెడ్ చేశారు. కానీ త్రివిక్రమ్ ఆ మధ్యలో పవన్ కి, తనకి బేధాభిప్రాయాలేమీ రాలేదని... తామిప్పటికీ ఫోన్ లో మాట్లాడుకుంటున్నామని.. మా ఇద్దరి మధ్య కాస్త దూరం పెరిగిందని.... కానీ అభిప్రాయం బేధాల వలన కాదని.. కేవలం పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీ కావడం, నేను నా నెక్స్ట్ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ లో బిజీగా ఉండడం వల్లనే అని నెత్తీ నోరు బాదుకున్నాడు. కానీ త్రివిక్రమ్ ఎంత చెప్పిన గాసిప్ రాయుళ్లు ఊరుకుంటారా.. అయితే తాజాగా త్రివిక్రమ్, పవన్ కళ్యణ్ విడిపోలేదని కన్ఫర్మ్ అయ్యింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ హైదరాబాద్ లో కలిసి ఒక ఈవెంట్ కి హాజరయ్యారు.

భరతనాట్య ప్రదర్శనకు...

అది కూడా త్రివిక్రమ్ భార్య సౌజన్య శ్రీనివాస్ భరతనాట్యం ప్రదర్శన కోసం తిరిగి ఇద్దరు కలిసి కనిపించారు. త్రివిక్రమ్ భర్య భరతనాట్యంలో ప్రావిణ్యం సంపాదించి ఆమె హైదరాబాద్ లోని రవీంద్ర భారతి లో ఒక ప్రోగ్రాం ఇవ్వడంతో... దానికి త్రివిక్రమ్ తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని ఆహ్వానించగా పవన్ భార్య అన్నాతో కలిసి ఈవెంట్ కి హాజరయ్యాడు. మరి ఆ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల మధ్య ఉన్న క్లోజ్ నెస్ చూసిన ఎవ్వరైనా వీరి మధ్యన విభేదాలా... నెవర్ అని అనుకోకుండా ఉండరు. మరి తాజాగా వీరు కలిసిన ఈవెంట్ లోని ఫోటోను మీరూ చూడండి.

Similar News