మహేష్ కి దెబ్బేసిన పవనుడు

Update: 2018-04-21 08:43 GMT

గత వారం రోజులుగా సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ - రామ్ గోపాల్ వర్మ - శ్రీ రెడ్డి ల వ్యవహారం మాంచి వేడి మీదుంది. మరోపక్క మహేష్ బాబు భరత్ అనే నేను కి ఎన్నడూ లేని విధంగా ప్రమోషన్స్ పర్వం కొనసాగింది. అయినా కూడా మహేష్ భరత్ ప్రమోషన్స్ ని పక్కన పెట్టేసిన ఛానల్స్ తమ టీఆర్పీని పెంచుకునేందుకు పవన్ - వర్మ - శ్రీ రెడ్డి వ్యవహారం మీదే ఫోకస్ చేసాయి. ఆఖరుకి నిన్న శుక్రవారం సినిమా విడుదలై సక్సెస్ టాక్ వచ్చినా భరత్ అనే నేను మీద అస్సలు దృష్టి పెట్టలేదు ఛానల్స్. కారణం పవన్ కళ్యాణ్. ఎందుకంటే మహేష్ సినిమా విడుదలయ్యే సమయానికి పవన్ కళ్యాణ్ ఫిలిం ఛాంబర్ దగ్గర హడావిడి చెయ్యడం మెగా ఫ్యామిలీ మొత్తం అక్కడే ఉండడంతో ఛానల్స్ కి కావాల్సిన సరుకు అక్కడే దిరికింది. పవన్ తొ పాటు నాగబాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, వరుణ్ తేజ్ ఇలా మెగా హీరోలంతా ఫిలిం ఛాంబర్ లో ఉంటె దాని నుండి వచ్చే మసాలా న్యూస్ మీదే ఛానల్స్ ఫోకస్ పెడతాయి గాని.. భరత్ మీద ఎందుకు ఫోకస్ పెడతాయి.

ఇక మహేష్ బాబు భరత్ అనే నేను ప్రపంచ వ్యాప్తంగా విడుదలై అదిరిపోయే టాక్ తెచ్చుకుని సూపర్ హిట్ అయ్యే విధంగా కలెక్షన్స్ రాబడుతుంది. మరి మాములుగా మహేష్ మూవీస్ కి బయట భారీ క్రేజ్ ఉంటుంది. అలాగే మొదటిసారి ఒక స్టార్ హీరో పూర్తిస్థాయి సినిమా లో సీఎం గా నటించడం, అందులోను మహేష్ క్యూ లుక్ తొ సీఎం స్థానాన్ని ఎలా భర్తీ చేసాడో అనే క్యూరియాసిటీ తొ ఉన్న జనానికి మహేష్ సీఎం నటన అరిపించేసింది. అంతమంచి టాక్ వచ్చిన మహేష్ మాత్రం సోషల్ మీడియాలో వెనకబడ్డాడు. అలా మహేష్ సోషల్ మీడియాలో వెనక బడ్డానికి మొదటినుండి చెప్పుకునే రెండు బలమైన కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది పవన్ కళ్యాణ్, రెండోది చంద్రబాబు నాయుడు.

మొదటిది గట్టి కారణమే. అది కూడా పవన్ రూపంలో మహేష్ కి తగిలింది. పవన్ తన మీద తన తల్లి మీద చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని, అయన కొడుకు లోకేష్ ని, తెలుగు రాష్ట్రాల్లో టాప్ లో ఉన్న ఛానల్స్ టీవీ 9 ని, ఏబీఎన్ ని కలిపి విమర్శించడం, అలాగే పవన్ తనకు వర్మకు రేగిన వివాదం గురించి పరిష్కారం చూపాలంటూ ఫిలిం ఛాంబర్ కు మెగా హీరోలందరితో వచ్చి అక్కడ లాయర్లు తొ మీటింగ్ పెట్టడం వంటి విషయాలతో ఫ్యాన్స్ మొత్తం పవన్ కోసం ఫిలిం ఛాంబర్ కి చేరుకోవడం, అలాగే ఛానల్స్ లో, సోషల్ మీడియా లో పవన్ ఏం మాట్లాడతా అని బాగా సెర్చ్ చెయ్యడంతో సోషల్ మీడియాలో పవన్ టాప్ 3 ట్రేండింగ్ లోకి వచ్చేసాడు.

ఇక మరో కారణం ఏపీ సీఎం చంద్రబాబు. ఆయన చేపట్టిన ధర్మ దీక్షని అన్ని ఛానల్స్ ఉదయం నుంచి సాయంత్రం దాక నాన్ స్టాప్ గా లైవ్ కవరేజ్ ఇవ్వడంతో.. మహేష్ కి బాగా దెబ్బపడింది. మహేష్ భరత్ అనే నేను హిట్ టాక్ వచ్చేసి విడుదలైన థియేటర్ల దగ్గర మహేష్ అభిమానుల హాడావిడి ని అసలు కవర్ చెయ్యలేదు. అలా టాప్ న్యూస్ లతో, టాప్ సెర్చింగ్ తొ టాప్ 3 ట్రెండింగ్ లో పవన్ కళ్యాణ్‌ ఉన్నాడు.. కాని టాప్ 20లో 12 నుండి 17వ స్థానం మధ్యలో భరత్ అను నేను గురించి ట్రెండ్ అయ్యింది. మరి పవన్ ఇష్యు, ఆ బాబు దీక్ష లేకపోతె భరత్ టాప్ 5 లోకి వచ్చేసేవాడే. అందుకే పవన్, మహేష్ బాగా దెబ్బేసాడు అని అనాల్సి వచ్చింది.

Similar News