ఒకేసారి రెండు చుట్టేస్తా అంటున్న పవన్?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగనంతవరకే… ఒక్కసారి రంగంలోకి దిగాడు అంటే ఎదురు వాడికి తడిసిపోవాలే.. ఇది ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ నుండి వస్తున్న సమాధానం. [more]

Update: 2020-01-08 05:46 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగనంతవరకే… ఒక్కసారి రంగంలోకి దిగాడు అంటే ఎదురు వాడికి తడిసిపోవాలే.. ఇది ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ నుండి వస్తున్న సమాధానం. రాజధాని (అమరావతి) రైతులకు మద్దతిస్తున్న పవన్ కళ్యాణ్ త్వరలోనే పింక్ రీమేక్ సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. ప్రస్తుతం రాజకీయాల్లో తన రైట్ హ్యాండ్ లెఫ్ట్ హాండ్స్ అయిన జెడి లక్ష్మి నారాయణకు, రాపాకకు జనసేన పగ్గాలు అప్పజెప్పి.. పవన్ కళ్యాణ్ సినిమాల్లో బిజీ కావాలని చూస్తున్నాడు. రాజకీయాలను కూడా వదలకుండా చూసుకుంటూనే పవన్ సినిమాలు చెయ్యాలనుకున్నాడు. కానీ ప్రస్తుతం రాజకీయాలు సినిమా అంటే కష్టం కాబట్టి.. రాజకీయాలకు చిన్నపాటి విరామం ఇచ్చి సినిమాలవైపుకి వస్తున్నాడట.

దిల్ రాజు బ్యానర్ లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ ఈనెల 20 నుండి అధికారికంగా పవన్ తో పాటుగా పట్టాలెక్కబోతుంది. హిందీ, తమిళ భాషల్లో హిట్ కావడంతో పవన్ పింక్ రీమేక్ పై భారీ అంచనాలు ఏర్పడడం, పవన్ రీ ఎంట్రీ మీదున్న క్రేజ్ తో పింక్ రీమేక్ ఇప్పుడు హాట్ కేక్ లా కనబడుతుంది. ఇక పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ తోపాటుగా క్రిష్ సినిమా ని పట్టాలెక్కించబోతున్నాడని.. పింక్ రీమేక్ – క్రిష్ సినిమా పారలల్ గా చేయబోతున్నాడనే టాక్ నడుస్తుంది. ఇటు వేణు శ్రీరామ్, అటు క్రిష్ కూడా తమ తమ సినిమా స్క్రిప్ట్స్ తో రెడీ గా ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా రెండు సినిమాలు ఒకేసారి చెయ్యాలని నిర్ణయించుకున్నాడని…. రెండు సినిమాలు చేసి మళ్ళీ విరామం తీసుకుని రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని పవన్ ప్లాన్. అందుకే పింక్ రీమేక్ తో పాటుగా క్రిష్ ఫిలిం పూర్తి చేయబోతున్నాడనే టాక్ నడుస్తుంది. మరి పవన్ రావడం లేట్ గాని.. ఒక్కసారి వచ్చాడంటే…… అంటున్నారు ఫ్యాన్స్.

Tags:    

Similar News