ఏంటి క్రిష్…

ఎన్టీఆర్ బయోపిక్ తో మాయమైన దర్శకుడు క్రిష్, పవన్ కళ్యాణ్ సినిమాతో మళ్ళి న్యూస్ లోకొచ్చాడు. పవన్ కళ్యాణ్ తో క్రిష్ సినిమా ఓకె అవడం పాపం.. [more]

Update: 2020-02-28 05:39 GMT

ఎన్టీఆర్ బయోపిక్ తో మాయమైన దర్శకుడు క్రిష్, పవన్ కళ్యాణ్ సినిమాతో మళ్ళి న్యూస్ లోకొచ్చాడు. పవన్ కళ్యాణ్ తో క్రిష్ సినిమా ఓకె అవడం పాపం.. డిజిటల్ ప్లాప్ ఫార్మ్ మీద వెబ్ సీరీస్ లు కూడా నిర్మిస్తూ క్రిష్ వార్తల్లోకొచ్చాడు. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత సైలెంట్ అయ్యాడనుకుంటే.. క్రిష్ మాత్రం తన పనులు తాను చేసుకుపోతున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ తో క్రిష్ పాన్ ఇండియా ఫిలిం ని ప్లాన్ చేశాడన్నారు. కానీ మధ్యలో అంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా వద్దులే.. ఈమధ్యన సాహో, సై రా ల మీద పడిన ఎఫెక్ట్ మన మీద కూడా పడితే కష్టమని పాన్ ఇండియా సినిమా ఆలోచన విరమించారనుకున్నారు. కానీ తాజాగా క్రిష్ ప్లాన్స్ చూస్తుంటే ఇది పక్కా పాన్ ఇండియా ఫిలిం అనిపిస్తుంది.

హీరోయిన్ గా కీర్తి సురేష్ ని సంప్రదిస్తున్నారని.. ఇంకా క్రిష్ పవన్ కళ్యాణ్ తో ఫైట్ చేసేందుకు ఓ బాలీవుడ్ నటుడుని కలిసినట్టుగా వార్తలొస్తున్నాయి. సాహో మాదిరిగా సినిమాలో బాలీవుడ్ నటులకు చోటు కల్పిస్తే.. బాలీవుడ్ ఆడియన్స్ ఏ విధంగా కనెక్ట్ అవుతారో సాహో బాలీవుడ్ హిట్ చూస్తే తెలుస్తుంది. అందుకే క్రిష్ కూడా పవన్ కోసం బాలీవుడ్ లో ఫెమస్ అయిన అర్జున్ రాంపాల్‌ ని పవన్ కళ్యాణ్ కి విలన్ గా తీసుకురాబోతున్నాడట. అర్జున్ రాంపాల్‌కి చూపుల్లోనే విలనిజం ఉంటుందని.. విలన్ పాత్రకి పర్ఫెక్ట్ సెట్ అంటున్నారు. మరోపక్క హాట్ యాంకర్ అనసూయ క్రిష్ – పవన్ ఫిలిం లో ఓ కీ రోల్ చేయబోతున్నట్లుగా వార్తలున్నాయి. ఇక క్రిష్ తాజా ఆలోచనలతో పవన్ తో క్రిష్ పాన్ ఇండియా ఫిలిం పక్కా అనిపిస్తుంది కదూ..!

Tags:    

Similar News