‘చిత్రలహరి’కి పవన్ కళ్యాణ్ ప్రశంసలు

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన చిత్రం `చిత్ర‌ల‌హ‌రి`. ఏప్రిల్ 12న విడుద‌లైన [more]

Update: 2019-04-17 09:41 GMT

సుప్రీమ్ హీరో సాయితేజ్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కిన చిత్రం 'చిత్ర‌ల‌హ‌రి'. ఏప్రిల్ 12న విడుద‌లైన ఈ చిత్రం సూప‌ర్‌ హిట్ టాక్‌తో విమ‌ర్శ‌కుల, ప్రేక్ష‌కుల ప్ర‌శంస‌లు అందుకుని స‌క్సెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. సినిమా చూసిన వారందరూ యూనిట్‌ను అభినందిస్తున్నారు. ఇటీవ‌ల సినిమాను వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి.. సాయి తేజ్‌, నిర్మాత‌లు, ద‌ర్శ‌కుడిని అభినందిస్తూ ఓ వీడియో సందేశం పంపిన సంగ‌తి తెలిసిందే. తాజాగా సినిమాను ప‌వ‌న్‌క‌ల్యాణ్ చూశారు. ఆయ‌న‌కు సినిమా బాగా న‌చ్చ‌డంతో యూనిట్‌ను అభినందిస్తూ చిత్ర యూనిట్‌కు ఫ్ల‌వ‌ర్ బొకెల‌ను పంపారు. 'కంగ్రాట్స్ .. మీ వ‌ర్క్‌ ను నేను ఎంతో బాగా ఎంజాయ్ చేశాను' అంటూ మెసేజ్ కూడా పంపారు ప‌వ‌న్ క‌ల్యాణ్‌.

Tags:    

Similar News