‘సత్యాగ్రహి‘ సినిమా నేనే ఆపేశాను..!

Update: 2018-12-17 07:31 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్వీయ దర్శకత్వంలో అప్పట్లో “సత్యాగ్రహి” సినిమాను అనౌన్స్ చేశారు. దీనికి ఏ.ఎం.రత్నం నిర్మాతగా వ్యహరించారు. ఎంతో అట్టహాసంగా ప్రారంభమైన ఈ సినిమాకు మొదట్లోనే బ్రేక్ పడింది. దాదాపు స్క్రిప్ట్ మొత్తం రెడీ అయ్యి సెట్స్ మీదకు వెళ్తున్న టైంలో ఈ సినిమాను పవన్ కల్యాణే ఆపేసారు. దానికి కారణం ఏంటి అనేది ఎవరికీ తెలియలేదు. ఈ సినిమాను నిర్మిద్దామనుకున్న రత్నం కూడా సినిమాలకు దూరంగా జరిగి చాలా కాలం గ్యాప్ తీసుకున్నారు. ఈ నేపధ్యంలో చాలాకాలం తరువాత 'సత్యాగ్రహి' ప్రసక్తి వచ్చింది.

నిజజీవితంలో చూపించడానికే...

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అమెరికా టూర్ లో ఉన్నాడు. జనసేన తరుపు ప్రవాస గర్జన పేరుతో ప్రవాసులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 'సత్యాగ్రహి' సినిమా టాపిక్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ఈ సినిమా గురించి మాట్లాడుతూ...'సత్యాగ్రహి' అనే సినిమా ఆపేసింది.. దాన్ని నిజ జీవితంలో చేసి చూపించడానికేనన్నారు. అప్పట్లో పొలిటిక్స్ లోకి రావాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను ఆపేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఆ సినిమాను నిజ జీవితంలో నిజం చేయడానికి ట్రై చేస్తున్నా అని పవన్ అనడంతో ఫ్యాన్స్ ఉప్పొంగిపోతున్నారు. దీంతో ఇప్పుడు “సత్యాగ్రహి” సినిమా ఆపేసారు అనే బాధ ఫ్యాన్స్ లో లేదు.

Similar News