పవన్ ఓకే అన్నారటగా

ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎవరికి క్లారిటీ లేదు. కానీ [more]

Update: 2019-10-17 08:33 GMT

ప్రస్తుతం పాలిటిక్స్ లో బిజీ అయిపోయిన పవన్ కళ్యాణ్ మళ్లీ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు అని ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. దీనిపై ఎవరికి క్లారిటీ లేదు. కానీ లేటెస్ట్ గా క్రిష్ చెప్పిన కథకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, నిర్మాత ఎ.ఎమ్ రత్నం అని, త్వరలోనే షూటింగ్ స్టార్ట్ అవ్వబోతుందని తెగ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో కొంతవరకు నిజమేనని తెలుస్తుంది. క్రిష్ విజయవాడ వెళ్లి పవన్ కళ్యాణ్ కి లైన్ చెప్పారు. ఆయన ఓకే కూడా చేశారు. కానీ నిర్మాత ఎవరు అనేది మాత్రమే తెలియదు.

పింక్ తర్వాతే……

పవన్ కళ్యాణ్ అప్పుడే ఈ మూవీ చేయడు. దీనికన్నా ముందు తమిళ ‘పింక్’ సినిమా చేయాలనీ చూస్తున్నాడు. పింక్ సినిమాకి దిల్ రాజు నిర్మాత గా వ్యవహరించనున్నారు. దిల్ రాజు తో పాటు మరో నిర్మాత కూడా భాగస్వామి కానున్నాడు. అతను రామ్ చరణ్ అని వార్తలు వస్తున్నాయి. పవన్ ఎప్పుడు ఓకే అంటారు? ఎప్పుడు చేస్తారు అన్నది మాత్రం ఇప్పటికి తెలియదు. ఒకవేళ ఒకే అంటే మాత్రం పనులు చకచకా అయిపోతాయి.

 

Tags:    

Similar News