పరశురాం కి అంత డబ్బు ఇచ్చింది ఎవరు?

Update: 2018-11-05 07:59 GMT

'యువత' సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరయిన పరశురాం ఆ తరువాత రవితేజతో 'ఆంజనేయులు', నారా రోహిత్ తో 'సోలో' వంటి చిత్రాలు తీసి మరింత దగ్గర అయ్యాడు. అయితే అప్పటివరకు యావరేజ్ డైరెక్టర్ గా పేరు ఉన్న పరశురాం 'గీత గోవిందం'తో ఒకేసారి స్టార్ డైరెక్టర్ లిస్ట్ లో చేరిపోయాడు. దాంతో తన రేంజ్ మారిపోయింది. ఈ నేపధ్యంలో పరశురాంతో సినిమాలు తీయడానికి చాలామంది నిర్మాతలు క్యూ కడుతున్నారు. కొన్ని నెలలు కిందట పరశురాంకి ఓ స్టార్ ప్రొడ్యూసర్ దాదాపు పది కోట్ల దాక ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది.

రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి...

ఆయనతో సినిమా చేయడానికి ఆ ప్రొడ్యూసర్ అంతగా ఆఫర్ చేసినట్టు తెలుస్తుంది. పది కోట్లలో సగం అంటే ఐదు కోట్లు అడ్వాన్స్ రూపంలో ఇచ్చినట్టు సమాచారం. ఆ డబ్బుని విశాఖపట్నం ఏరియాలో రియల్ ఎస్టేట్ లో పెట్టాడట పరశురాం. సినీ ఇండస్ట్రీలో ఎవరి భవిష్యత్తు ఎప్పుడు మారుతుందో చెప్పలేం అని.. అది ముందుగానే గ్రహించి పరశురాం ఈ పని చేసినట్టు తెలుస్తుంది. పరశురాం ఇంతలా డబ్బు తీసుకోడం ఇదే మొదటిసారి. ప్రస్తుతం అతను తన నెక్స్ట్ మూవీ కథ చర్చల్లో బిజీగా ఉన్నాడు. మరి పరశురాంకి అడ్వాన్స్ ఇచ్చిన ఆ నిర్మాత ఎవరో తెలియాల్సి ఉంది.

Similar News