పరశురామ్ సుడి తిరిగిపోయింది..!

Update: 2018-08-18 08:44 GMT

'గీత గోవిందం' సినిమా ఇంతలా సక్సెస్ అవ్వటానికి కారణం దాని దర్శకుడు పరశురామ్. దాదాపు మూడేళ్ల నుండి ఈ స్క్రిప్ట్ ను సెట్స్ మీదకు తీసుకుని వెళ్లడానికి చాలానే కష్టపడ్డాడు. అతని కష్టం ఫలితంగా 'గీత గోవిందం' సూపర్ హిట్ అయింది. సూపర్ హిట్ అవ్వడమే కాదు వసూళ్ల వర్షం కురిపిస్తుంది. దీంతో పరశురామ్ డిమాండ్ ఇప్పుడు పీక్స్ లో ఉంది. ఆయనతో సినిమా చేయడానికి హీరోలు, బడా ప్రొడ్యూసర్లు ఎదురు చూస్తున్నారు.

మళ్లీ అదే బ్యానర్ పై...

ఇప్పటికే పరుశురామ్ గీత ఆర్ట్స్ 2 లోనే మరో సినిమా కంఫర్మ్ అయ్యినట్టు వార్తలు కూడా వచ్చాయి. దీంతో పాటు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు కూడా లైన్ ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాకుండా హీరో మంచు విష్ణుతో పరశురామ్ ఓ సినిమా చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు. అయితే కొన్ని మీడియా సైట్స్ లో మాత్రం ఆ కాంబినేషన్ లో సినిమా ఉందని.. కొన్ని సైట్స్ లో లేదని రాస్తున్నారు.

విష్ణుని గట్టెక్కిస్తాడా..?

కానీ తాజా సమాచారం ప్రకారం పరశురామ్ మంచు బ్యానర్ నుంచి అడ్వాన్స్ తీసుకున్న మాట నిజమేనట. మంచు విష్ణు హీరోగా సినిమా చేయడానికి ఒప్పుకున్నాడని వస్తున్న వార్తలు నిజమేనని తెలుస్తుంది. కానీ విష్ణుతో సినిమా ఎప్పుడు చేస్తాడో క్లారిటీ మాత్రం పరశురామ్ ఇవ్వలేదట. సో సినిమా సెట్స్ మీదకు వెళ్లటానికి లేట్ అయ్యే అవకాశం ఉంది. మరి ఇప్పుడు వెంటనే గీత ఆర్ట్స్ 2లోనే వరసగా మూడో సినిమా చేయబోతున్నాడు పరశురామ్. దీని తర్వాత మైత్రి మూవీస్ తో ఇంకో సినిమా ఉండొచ్చు అని టాక్. అయితే మరి ఈ రెండిట్లో ఏది ముందో మాత్రం పరశురామ్ ఇంకా క్లారిటీ ఇవ్వలేదంట. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో ముగ్గురికి కమిట్ అయిన మాట నిజమేనని ఒప్పుకున్నాడు. కానీ ఏది ఎప్పుడు స్టార్ట్ చేస్తాడో మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం విష్ణు పరిస్థితి ఏమీ అంతగా బాగోలేదు. తను చేసిన సినిమాలు వరస డిజాస్టర్స్ అవుతున్నాయి. మరి విష్ణుని పరుశురాం గట్టెక్కిస్తాడో లేదో చూడాలి.

Similar News