పరుశురాంకి ఫుల్ క్లారిటీ ఉందిగా..!

Update: 2018-10-02 06:39 GMT

విజయ్ దేవరకొండ లాంటి మీడియం రేంజ్ హీరోని పెట్టి పరుశురాం 'గీత గోవిందం' అనే చిన్న సినిమా తీసాడు. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం రూ.100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. దీంతో పరుశురాం సుడి కూడా మారిపోయింది. అతనికి వరసగా సినిమాలు రావడం.. సినిమాకి ఇంత అని డిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. దీంతో పరుశురాం పారితోషికం రూ.6 కోట్ల వ‌ర‌కూ చేరింది.

ఆఫర్లు బాగానే వస్తున్నా...

'గీత గోవిందం' సినిమాను నిర్మించిన అల్లు అరవింద్ తోనే పరుశురాం మరో సినిమా చేస్తున్నాడు. రీసెంట్ గా ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు పరుశురాంకి అడ్వాన్స్ ఇచ్చిన‌ట్టు తెలుస్తోంది. మరో ఇద్దరు నిర్మాతలు కూడా పరుశురాంపై ఇంట్రెస్ట్ చూపుతున్నారని తెలుస్తుంది. ఆఫర్స్ వస్తున్నాయి కదా అని తొందరపడి ఏ సినిమాను ఓకే చెయ్యట్లేదు ఈ డైరెక్టర్.

అల్లు అర్జున్ లేదా మహేశ్ తో...

తన వద్ద ప్రస్తుతం కొన్ని లైన్స్ మాత్రమే ఉన్నాయని.. అవి పూర్తి అవ్వాలంటే కొంత టైం పడుతుందని అందుకే తొందరపడి ఏ సినిమాను ఒప్పుకోట్లేదని చెబుతున్నాడు. తన వద్ద లైన్స్ కి అల్లు అర్జున్ లేదా మహేష్ సెట్ అవ్వుతారని చెబుతున్నాడు. వీరిద్దరూ త‌న‌కు దొర‌కాలంటే కాస్త టైమ్‌ ప‌డుతుంది. అందుకే.. క‌థ‌, స్క్రిప్టు విష‌యంలో తొంద‌రేం లేదు. కొంత కాలం విశ్రాంతి తీసుకుని తీరిగ్గా స్క్రిప్ట్ విషయం గురించి ఆలోచిస్తానని చెబుతున్నాడు పరుశురాం.

Similar News