ఇన్నాళ్లు ఏమైపోయావ్ పరిణితి..!

Update: 2018-09-27 09:07 GMT

బాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోయిన్స్ లో పరిణితి చోప్రా ఒకరు. తన యాక్టింగ్ తో ప్రేక్షకులని ఫిదా చేయడమే కాదు సినిమాలను ఎంచుకోవటంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఈమె ఇండస్ట్రీకి వచ్చి 8 ఏళ్లు అవుతున్నా కేవలం 15 సినిమాలు మాత్రమే చేసింది. ఆలా ఎక్కువ టైంలో తక్కువ సినిమాలు చేయడానికి కారణం ఆమె ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉండటం. తన మొదటి సినిమా నుండి ఆమె గ్లామర్ షోకి నో చెప్తూనే వచ్చింది. మరి ఆలా ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉండటంతో ఆఫర్స్ తగ్గాయేమో అని బావించిందేమో కానీ అందాల ఆరబోతకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అందుకే తను ఇన్నాళ్లు దాచుకున్న తన అందాలు ఒకేసారి బయట పెట్టేసింది.

వరుస సినిమాలతో...

రీసెంట్ గా ఫిలిం ఫేర్ మ్యాగజైన్ కోసం బ్లాక్ బికినీలో పరిణితి చోప్రా ఇచ్చిన పోజు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆ స్టిల్ ను చూసి మతిపోని వారు ఎవరూ ఉండరు. అసలు ఇన్నాళ్లు ఏమైపోయావ్ పరిణితి అంటూ కామెంట్స్ కూడా చేస్తున్నారు. బికినీ షోతో నాలో ఈ కోణం కూడా ఉందని చెప్పకనే చెబుతుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హీరో అర్జున్ కపూర్ తో రెండు సినిమాల్లో నటిస్తుంది. ఒకటి 'నమస్తే ఇంగ్లాండ్'..రెండోది 'సందీప్ ఔర్ పింకీ ఫరార్'. 'నమస్తే ఇంగ్లాండ్' విడుదలకు రెడీగా ఉంది. ఈ రెండు కాకుండా అక్షయ్ కుమార్ తో నటించిన హిస్టారికల్ మూవీ 'కేసరి'..సిద్దార్థ్ మల్హోత్రా తో చేస్తున్న 'జబ్రియా జోడి' సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. మరి ఈ గ్లామర్ షో తర్వాత ఇంకెన్ని సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుందో చూడాలి.

Similar News