పేపర్ బాయ్ టీజర్ కి అద్భుతమైన స్పందన..!

Update: 2018-07-27 10:03 GMT

సంపత్ నంది నిర్మాతగా సంతోష్ శోభన్, రియా సుమన్ మరియు తాన్య హోప్ ప్రధాన పాత్రల్లో వస్తున్న చిత్రం 'పేపర్ బాయ్'. ఇటీవలే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ 2.5 మిలియన్ డిజిటల్ వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డు సృష్టించగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రాబట్టుకుంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతూ త్వరలో సినిమాకి సంబంధించిన థియరిటికల్ ట్రైలర్ ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అలాగే సినిమాలోని మొదటి పాటను జులై 28న సాయంత్రం 3 గంటలకు రిలీజ్ చేస్తామని చెప్పారు. పేపర్ బాయ్ గా పనిచేస్తూ ఓ అమ్మాయిని లవ్ చేసే ఇంజనీరింగ్ చదివే కుర్రాడి చుట్టూ తిరిగే ఈ సినిమాకి జయ శంకర్ దర్శకత్వం వహించగా బెంగాల్ టైగర్ ఫేమ్ భీమ్స్ సంగీతం, సౌందర్య రాజన్‌ సినిమాటోగ్రఫీ బాధ్యతలను నిర్వర్తించారు..

Similar News