పంతం వారం దాటింది

Update: 2018-07-13 13:42 GMT

ఎగ్రెసివ్ హీరో గోపీచంద్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం 'పంతం'. యాక్ష‌న్‌, క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌తో త‌న‌కంటూ ఓ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న గోపీచంద్ 25వ చిత్రమిది. కె.చ‌క్ర‌వ‌ర్తి ద‌ర్శ‌క‌త్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ స‌త్య‌సాయి ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై ప్రెస్టీజియ‌స్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. ఓ వైపు క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో పాటు.. మెసేజ్ ఉన్న పంతం సినిమా జూలై 5న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లై గ్రాండ్ స‌క్సెస్ సాధించి విజ‌య‌వంతంగా రెండోవారంలోకి అడుగు పెట్టింది.

గోపీచంద్ కెరీర్ లో ఎక్కువ వసూలు చేసింది

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ...''సినిమా మేకింగ్ విష‌యంలో ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాలేదు. భారీ బ‌డ్జెట్‌తో సినిమాను అద్భుతంగా రూపొందించాం. మెసేజ్ ఓరియెంటెడ్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలతో ప్రేక్షకుల‌ను మెప్పించ‌డం చాలా క‌ష్టం. ద‌ర్శ‌కుడు చ‌క్ర‌వ‌ర్తి కొత్త‌వాడైనా చ‌క్క‌టి క్లారిటీతో 'పంతం'లాంటి మెసేజ్ చిత్రాన్ని అద్భుతంగా తెర‌కెక్కించారు. క్లైమాక్స్‌ లో కోర్టు సీన్‌.. అందులో ఎమోష‌న‌ల్‌గా గోపీచంద్‌ చెప్పిన డైలాగ్స్‌ కు ప్రేక్ష‌కులు ఫిదా అయ్యారు. 'పంతం' సినిమా గోపీచంద్‌ కెరీర్‌లోనే హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్‌గా నిలిచింది. మంచి కలెక్షన్స్‌ తో విజ‌య‌వంతంగా రెండోవారంలోకి అడుగుపెట్టింది. తిరుగులేని విజయాన్ని అందించిన ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌'' అన్నారు.

Similar News