ప్రభాస్ మాత్రమే చేయగలడని..?

ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమాని ప్రకటించి ఓం అనౌత్ అందరికి షాకివ్వలేదు కానీ.. ఓం రనౌత్ తో ప్రభాస్ సినిమా అనగానే బాలీవుడ్ హీరోలే షాకయ్యారు. తానాజీ [more]

Update: 2020-08-25 04:52 GMT

ప్రభాస్ తో ఆదిపురుష్ సినిమాని ప్రకటించి ఓం అనౌత్ అందరికి షాకివ్వలేదు కానీ.. ఓం రనౌత్ తో ప్రభాస్ సినిమా అనగానే బాలీవుడ్ హీరోలే షాకయ్యారు. తానాజీ సెట్స్ పైకి వెళ్ళకముందు నుండే ఆదిపురుష్ గురించిన ఆలోచనలు దర్శకుడు ఓం రనౌత్ లో ఉన్నాయట. ఆ విషయాన్నే ఆయనే స్వయంగా చెబుతున్నాడు. ఈ సినిమా విషయంలో చాలా పరిశోధన చేశాను అని… రఫ్ గా ఓ డ్రాఫ్ట్ తయారు చేసుకున్నాకే నా టీం కి ఆదిపురుష్ కథ వినిపించగా.. చాల హ్యాపీ ఫీల్ అయ్యారు అని అంటున్నాడు ఓం రనౌత్. ఈ సినిమా కథ ప్రభు రామ్ కథ అని.. ఇతిహాసగాదలో ఓ భాగం అని… చరిత్రకకోణం నుండి ఇప్పటికే దీనిపై పరిశోధనలు పూర్తి చేశామని చెబుతున్నాడు దర్శకుడు ఓం.

ఇప్పటికే ఆదిపురుష్ స్క్రీన్ ప్లే అప్ డేట్ కూడా అయ్యింది అని… కథావస్తువులో మార్పులు లేనప్పటికీ.. దాన్ని తీర్చి దిద్దే విధానం నేటి పరిస్థితులకి కొత్తగా ఉంటుంది. భారీ బడ్జెట్ తో 3D లో రూపొందుతున్న ఈ సినిమాకి ప్రభాస్ నే హీరోగా ఎందుకు ఎంపిక చేసారు అని దర్శకుడిని అడిగితె.. దానికి ఆయన ఎం చెప్పాడో చూడండి. ప్రభాస్ మాత్రమే ఈ సినిమాకి, ఈ పాత్రకి సరిపోతాడని నాకు అనిపించింది. బాహుబలి గా ప్రభాస్ ఆహార్యం, ఆయన పర్సనాలిటీ, ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఆయన చూపు, నిలబడే విధానం, నడిచే తీరు అలా ఆదిపురుష్ పాత్రలో ప్రభాస్ నే ఊహించుకున్నాను.

ఒకవేళ ప్రబస్ ఒప్పుకోకపోతే నేను అసలు ఈ ఆదిపురుష్ సినిమాని చేసే వాడినే కాదు అంటున్నాడు ఓం. ఇక ఆదిపురుష్ లో రాముడిని ఎలా చూపించబోతున్నారని అడగగా.. ఇప్పుడిప్పుడే మాట్లాడితే అది తొందరపాటు అవుతుంది అంటూ తప్పించుకున్నాడు. ఎం మాట్లాడినా అది ఈ టైం లో కాంట్రవర్సీ అవుతుందని ఓం కి బాగా తెలుసు. అందుకే అలా తప్పించుకున్నాడు. 

Tags:    

Similar News