ఎన్టీఆర్ కోసం బాలీవుడ్ నుండి దిగుతున్నాడా?

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తుంటే.. విలన్ [more]

Update: 2021-03-31 06:09 GMT

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తుంటే.. విలన్ గా రావణ్ పాత్రలో బాలీవుడ్ సీనియర్ హీరో సైఫ్ అలీఖాన్ నటించబోతున్నాడు. అయితే ఇప్పుడు ప్రభాస్ కి విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ తెలుగులో మరో స్టార్ హీరో సినిమాలో విలన్ గా ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. అది ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో వచ్చే నెలలో మొదలు కాబోతున్న NTR30 లో ఎన్టీఆర్ తో ఫైట్ చేయబోయేది సైఫ్ అలీ ఖాన్ అంటున్నారు.
త్రివిక్రమ్ ఇప్పటికే సైఫ్ తో మంతనాలు మొదలు పెట్టినట్లుగా తెలుస్తుంది. సైఫ్ ఓకె చెబితే సినిమాకి మంచి క్రేజ్ వస్తుంది అని..అందుకే సైఫ్ అలీ ఖాన్ కోసం త్రివిక్రమ్ – ఎన్టీఆర్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట. మరి హీరోయిన్ గా కూడా బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ పేరు ఎన్టీఆర్ సరసన చక్కర్లు కొడుతోంది. అంటే ఈ లెక్కన NTR30 కి బాలీవుడ్ హంగులు ఎక్కువైనట్లే. అసలు ముందుగా సునీల్ శెట్టి ని విలన్ గా అనుకుంటే.. సునీల్ శెట్టి సౌత్ లో విలన్ గా నటించిన సినిమాల్ని ఫట్ మనడంతో త్రివిక్రమ్ మనసు మార్చుకుని సైఫ్ వెంటపడుతున్నట్లుగా తెలుస్తుంది.

Tags:    

Similar News