ఎన్టీఆర్ ఇండియా వచ్చి ఏం చేసాడు!!

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తో రామ్ చరణ్ తో కలిసి బడా మల్టీస్టారర్ పాన్ ఇండియా మూవీ RRR లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా ఎన్టీఆర్ [more]

Update: 2020-06-10 03:53 GMT

ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి తో రామ్ చరణ్ తో కలిసి బడా మల్టీస్టారర్ పాన్ ఇండియా మూవీ RRR లో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో మరో మూవీ మొదలెట్టాడు. ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో తెలియదు కానీ… త్రివిక్రమ్ ఎన్టీఆర్ కోసం ఓ క్లాసీ స్టోరీని రెడీ చేసుకున్నాడట. అందులో ఎన్టీఆర్ బిజినెస్ మ్యాన్ గా కనిపించబోతున్నాడనే ప్రచారం ఎప్పటినుండో ఉంది.. అయితే ఎప్పుడు ఈ కథ చాలా వరకు విదేశాల్లో ఉంటుంది అని.. అంటున్నారు. మరి కరోనా కారణముగా విదేశాల్లో షూటింగ్ అంటే ఇప్పట్లో సాధ్యమయ్యేలా లేదు. త్రివిక్రమ్ ఏం చేస్తాడో కానీ… ప్రస్తుతం ఈ కథపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారంలో ఉంది.

అదేమిటంటే ఎన్టీఆర్ ఈ సినిమాలో విదేశాల్లోనే పుట్టి అక్కడే పెరుగుతాడని.. అక్కడనుండి అనుకోకుండా ఇండియాకి రావాల్సి ఉంటుంది అని.. అయితే ఇక్కడ ఇండియా కొచ్చిన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడని అంటున్నారు. అలాగే ఈ సినిమాలో భిన్నమైన రాజకీయ నేపథ్యం తో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రస్తావించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసినిమా కోసం త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో సమానమైన ఓ పాత్రని సిద్ధం చేస్తున్నాడని… అది ఎవరికీ దక్కుతుంది అనే న్యూస్ ఉంది. అలాగే ఇద్దరు హీరోయిన్స్ ఈ సినిమా లో కనిపించబోతున్నారని అంటుంటే.,. కరోనా నేపథ్యంలో త్రివిక్రమ్ విదేశాల్లో షూటింగ్ జరపడం కుదరదు కాబట్టి స్క్రిప్ట్ లో ఎమన్నా మార్పులు చేసే అవకాశం కూడా ఉండొచ్చు అంటున్నారు. 

Tags:    

Similar News