బాలీవుడ్ కి ఈసినిమాతో కళ వచ్చింది

సినిమా టాక్ బట్టే కలెక్షన్స్ వస్తున్న ఈరోజుల్లో భారీ సినిమాల మీద ఆశలు పెట్టుకుని రిలీజ్ చేస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాకొడుతున్నాయి. ఈ నేపథ్యంలో [more]

Update: 2019-01-02 03:28 GMT

సినిమా టాక్ బట్టే కలెక్షన్స్ వస్తున్న ఈరోజుల్లో భారీ సినిమాల మీద ఆశలు పెట్టుకుని రిలీజ్ చేస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాకొడుతున్నాయి. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో దీపావళికి కానుకగా వచ్చిన ‘థగ్స్ అఫ్ హిందూస్తాన్’ సినిమాకు ఎక్సపెక్టషన్స్ ఒక రేంజ్ లో ఉన్నపటికీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుని చాలా తక్కువ కలెక్షన్స్ తో సరిపెట్టుకుంది. అమీర్ ఖాన్..అమితాబ్ లు ఈసినిమా తో ప్రేక్షకులని నిరాశ పరిచారు.

అలానే గత వారం రిలీజ్ అయినా షారుఖ్ ఖాన్ సినిమా ‘జీరో’ పరిస్థితి కూడా అంతే. బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో ప్రేక్షకులు నైరాశ్యంలో ఉన్నారు. ఇప్పుడు ఈ టైములో ‘సింబా’ రావడం.. పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో జనాలు థియేటర్లకు పోటెత్తుతున్నారు. దాంతో బాలీవుడ్ కి చాల రోజులకి సినిమా కల వచ్చింది. ఈమూవీకి ఎవరు ఊహించని స్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి. తొలి రోజు రణ్వీర్ సింగ్ కెరీర్లోనే అత్యధికంగా రూ. 20 కోట్లు వసూలు చేసిన చిత్రంగా నిలవడం విశేషం.

రెండో రోజు రూ.30 కోట్ల ప్లస్ చొప్పున..మొత్తంగా మూడు రోజుల్లోనే రూ.74 కోట్లకు చేరుకుంది. ఇది ఇండియా లెక్క మాత్రమే. విదేశాల్లో ఈసినిమా రూ.100 కోట్ల మార్కును దాటేసింది. మొన్న సోమవారం కూడా ఈ చిత్రానికి మంచి వసూళ్లే వచ్చాయంటున్నారు. ఇక నిన్న సెలవు కాబట్టి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది. సో త్వరలోనే రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్కును దాటే అవకాశముందని ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు. ‘టెంపర్’కు రీమేక్‌గా ‘సింబా’ తెరకెక్కిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News