'ఎన్టీఆర్' ఓవర్సీస్ రైట్స్ కి అంత ధరనా..?

Update: 2018-11-02 08:59 GMT

ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో 'ఎన్టీఆర్' బయోపిక్ ఒకటి. క్రిష్ - బాలకృష్ణ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో బాలకృష్ణ అచ్చం తన తండ్రి లానే కనిపించడంతో.. ప్రతీ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో అందరి చూపులు ఈ సినిమాపైనే పడ్డాయి. ఈ సినిమా రెండు భాగాలుగా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ హల్ చల్ చేస్తుంది. ఓవర్సీస్ లో ఈ సినిమా రెండు భాగాలు కలిపి ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ రూ. 20 కోట్ల భారీ మొత్తానికి చేజిక్కించుకుందట. బాలయ్య కెరీర్ లో ఇంతలా ఓవర్సీస్ రైట్స్ అమ్ముడవటం షాకింగే. అయితే ఎన్టీఆర్ జీవిత కథ కాబట్టి ఇంత రేట్ పెట్టి కొన్నట్టు తెలుస్తుంది.

రెండూ సక్సెస్ అయితేనే...

రెండు భాగాలు కలిపి ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే దాదాపు $4.5 మిలియన్ల కలెక్షన్స్ వసూలు చేయాల్సి ఉంటుంది. రెండు భాగాలు సూపర్ హిట్ అయితే తప్ప పెట్టుబడి వెనక్కి వచ్చే అవకాశం లేదు. మరి ఏవుతుందో చూడాలి. సంక్రాంతి కానుకగా మొదటి పార్టు 'కథానాయకుడు' జనవరి 11న రిలీజ్ అవుతుంది. రెండో పార్టు 'మహానాయకుడు' జనవరి 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Similar News