సినిమా హిట్ ని ఎంజాయ్ చేయలేకపోతున్నాడు..!

Update: 2018-10-16 06:41 GMT

ఎన్టీఆర్ - పూజ హెగ్డే జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ లో తెరకెక్కిన అరవింద సమేత వీరరాఘవ సినిమా దసరా సెలవుల కానుకగా అక్టోబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో యంగ్ టైగర్ తండ్రిని కోల్పోవడం... తర్వాత కూడా సినిమా షూటింగ్ ని చేసిన ఎన్టీఆర్ ఆ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ లో కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. ఇక సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకోవడమే కాదు... సినిమాకి సూపర్ హిట్ కలెక్షన్స్ రావడంతో అరవింద సమేత టీం ఫుల్ హ్యాపీ మోడ్ లో ఉంది.

సినిమా విజయవంతం అయినా...

ఇక సినిమా హిట్ అవడంతో దర్శకుడు త్రివిక్రమ్ నిర్మాతలు కూడా ఖుషీగా ఉన్నారు. అయితే ఈ సినిమా రాయలసీమ ఫ్యాక్షన్ బ్యాగ్డ్రాప్ లో తెరకెక్కడంతో... ఆ విషయంలో చిన్న చిన్న సమస్యలొచ్చినప్పటికీ... అది సినిమాకి మరింత పబ్లిసిటి అవుతుంది కానీ డ్యామేజ్ మాత్రం జరగదనే ధీమాతో అరవింద టీం ఉంది. ఇక అరవింద సమేత సినిమా సక్సెస్ మీట్ కి హాజరైన ఎన్టీఆర్ అందరి ముందు సంతోషంగా కనబడింది.. లోలోపల బాధలోనే ఉన్నాడు. ఇక తండ్రి మరణాన్ని బాధతో దిగమింగుకున్న ఎన్టీఆర్ అరవింద సమేత విజయాన్ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయలేకపోతున్నాడు.

కుటుంబంతో కలిసి విదేశాలకు...

ఇక సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లనున్నాడట. అరవింద సమేత షూటింగ్ ఒక పక్క, తండ్రి మరణం మరోపక్క... తాజాగా సినిమా కూడా విజయం సాధించడంతో.. సినిమా ప్రమోషన్స్ ని తనవంతు పూర్తి చేసిన ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి, కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో కలిసి విదేశాలకి వెళ్లి రిలాక్స్ అవుతాడట. ఇక అక్కడి నుండి రాగానే రాజమౌళి సినిమా కోసం కొత్తగా మేకోవర్ అవుతాడని తెలుస్తుంది.

Similar News