అభిమాని మృతికి ఎన్టీఆర్ సంతాపం

త‌న అభిమానికి మృతితో జూనియ‌ర్ ఎన్టీఆర్ భావొద్వేగానికి గుర‌య్యారు. కృష్ణా జిల్లాకు చెందిన జ‌య‌దేవ్ ముందు నుంచీ ఎన్టీఆర్ కు వీరాభిమాని. ఆయ‌న మ‌ర‌ణించ‌డంతో ఎన్టీఆర్ ఆయ‌న [more]

Update: 2019-05-06 06:23 GMT

త‌న అభిమానికి మృతితో జూనియ‌ర్ ఎన్టీఆర్ భావొద్వేగానికి గుర‌య్యారు. కృష్ణా జిల్లాకు చెందిన జ‌య‌దేవ్ ముందు నుంచీ ఎన్టీఆర్ కు వీరాభిమాని. ఆయ‌న మ‌ర‌ణించ‌డంతో ఎన్టీఆర్ ఆయ‌న కుటుంబానికి సంతాపం తెలియ‌జేశారు. నాకు అత్యంత ఆప్తుడు, కృష్ణా జిల్లా అభిమాన సంఘం ప్రతినిధి జయదేవ్ ఇక లేరు అన్న వార్త నన్ను తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. “నిన్ను చూడాలని” చిత్రం తో మొదలయిన మా ప్రయాణం ఇలా అర్ధాంతరం గా ముగిసిపోతుంది అని ఊహించలేదు. నటుడి గా నేను చుసిన ఎత్తుపల్లాలలో నాకు వెన్నంటే ఉన్నది నా అభిమానులు. ఆ అభిమానులలో, నేను వేసిన తొలి అడుగు నుండి నేటి వరకు నాకు తోడు గా ఉన్న వారి లో జయదేవ్ చాలా ముఖ్యమైన వారు. జయదేవ్ లేని లోటు నాకు తీరనిది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, ఆయన కుటుంబానికి నా ప్రగాఢమైన సానుభూతి ని తెలుపుతున్నాను. అని ఎన్టీఆర్ ఓ ప్ర‌క‌ట‌న చేశారు.

Tags:    

Similar News