ఇదే అభిమానులకు కావాల్సింది

Update: 2018-12-21 17:53 GMT

శుక్రవారం రాత్రి హైదరాబాద్ లోని జెఆర్సీకన్వెన్షన్ సెంటర్ లో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ఆడియో వేడుక నందమూరి ఫ్యామిలీ అండ్ అభిమానుల మధ్యన అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు సినిమా ఇండస్ట్రీలోని అతిరథ మహారథులు పాల్గొన్న ఈ వేడుక ఆద్యంతం నందమూరి అభిమానులను ఆకట్టుకుంది. కేవలం అభిమానులే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు ఆడియో వేడుకను చూడడానికి బుల్లితెరకు అతుక్కు పోయారు. మోహన్ బాబు, క్రిష్, కృష్ణంరాజు వంటి సీనియర్ నటులు, ఎన్టీఆర్ కూతుళ్లు, కొడుకులు మనవలు, రానా, సుమంత్, రకుల్, ప్రణీత, విద్య బాలన్ అందరూ పాల్గొన్న ఈ వేడుకలో మెయిన్ హైలెట్ బాలకృష్ణ ఎన్టీఆర్ గెటప్. అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఈ వేడుకకి రావడం. జూనియర్ ఎన్టీఆర్ అసలీ వేడుకకి వస్తాడా లేదా అనుకుంటున్న టైములో ఎన్టీఆర్ ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో కి వస్తున్నాడని చెప్పగానే నందమూరి అభిమానులు ఆనందం మాటల్లో చెప్పనలవి కాదు.

ఇక బాలకృష్ణ స్టేజ్ మీద అందరిని రిసీవ్ చేసుకున్న తీరు, ఆయన ఎనేర్జి ఎన్టీఆర్ అభిమానులంతా అంటే పరచూరి, మోహన్ బాబు, కళ్యాణ్ రామ్, కృష్ణ, అలనాటి తారలంతా నందమూరి నట సింహం ఎన్టీఆర్ గురించి మాట్లాడిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తాతగారు గురించి, ఎన్టీఆర్ బయోపిక్ గురించి దానికి పనిచేసిన టెక్నీకల్ టీం ని, దర్శకుడు క్రిష్ గురించి మాట్లాడిన తర్వాత బాలకృష్ణ తో ఎన్టీఆర్ అండ్ కళ్యాణ్ రామ్ లు ఫోటో దిగుతున్నపుడు.. ఫోటోగ్రాఫేర్స్ కళ్యణ్ రామ్ ని బాలయ్యని ఎన్టీఆర్ ని ఫోటో తీసేలోపు స్టేజ్ మీదున్న బాలయ్య ఎన్టీఆర్ తో ఆత్మీయంగా మాట్లాడడం, కళ్యాణ్ రామ్ బాబాయ్ బాలయ్య తలమీదున్న గులాబీ రేఖను తియ్యగా... దానికి సరదాగా బాలయ్య కళ్యాణ్ రామ్ ని మోచేతితో అలా తొయ్యడం చూసిన ప్రతి ఒక్కరు అంటే నందమూరి అభిమానులు అక్కడి అరుదైన దృశ్యం చూసి మైమరచిపోయి కేరింతలు కొట్టారు. ఎన్టీఆర్, బాలయ్య, కళ్యాణ్ రామ్ ఒకే ఫ్రెమ్ లో ఫోటోగ్రాఫేర్స్ కి ఫోటోకి ఫోజిచ్చారు. మరి మీరు ఆ ఫోటోని చూసి ఎంజాయ్ చెయ్యండి.

Similar News