మరో సమస్య వచ్చిపడింది

Update: 2018-07-06 05:30 GMT

పాపం నందమూరి బాలకృష్ణ ఏమంటు ఎన్టీఆర్ బయోపిక్ ని అనౌన్స్ చేసాడో అప్పటి నుండి ఈ సినిమాకు కష్టాలు తప్పలేదు. సినిమా ఓపెనింగ్ తర్వాత డైరెక్షన్ నుండి తేజ వెళ్ళిపోయాడు. తర్వాత ఆ ప్లేస్ ను క్రిష్ భర్తీ చేసాడు. ఇది ఇలా ఉండగా మళ్లీ ఇప్పుడు బాలకృష్ణ కి ఒక సమస్య ఎదురైంది. ఇందులో త‌మ‌ను విల‌న్‌గా చూపిస్తార‌ని నాదెండ్ల భాస్క‌ర‌రావు ముందే బాంబ్ పేల్చారు.

ఆలా చేస్తే మేము లీగల్ గా వెళ్తాము అని వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు అయన అనంత పని చేస్తూ బాలకృష్ణకు.. డైరెక్టర్ క్రిష్ కు నోటీసులు పంపించాడు. స్క్రిప్ మొత్తం తమకు చెప్పకుండా సినిమా తీస్తే ఉపేక్షించేదే లేద‌ని నాదెండ్ల కుటుంబ స‌భ్యులు వార్నింగులు ఇచ్చారు. దాంతో ఈ సినిమా ఇప్పటిలో సెట్స్ మీదకు వెళ్లడం కష్టమే అని తెలుస్తుంది.

ఒకవేళ ఇలా సినిమా ఆగితే 2019 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవ్వడం కష్టమే. సంక్రాంతి మిస్ అయితే సమ్మర్ లో రిలీజ్ అవుతుందా?. అసలే బాలయ్య సంక్రాంతి సెంటిమెంట్ ఎక్కువ. అది కాక 2019 సమ్మర్ లో రిలీజ్ అంటే ఎన్నిక‌ల కోడ్ నుంచి స‌మ‌స్య‌లు ఎదుర్కోవాల్సి ఉంటది. మరీ ఇన్ని అడ్డంకుల్ని ఎదుర్కొని బాల‌య్య ఈ సినిమాని ఎలా ప‌ట్టాలెక్కిస్తారోనన్న‌ది చూడాలి

Similar News