అదిరిపోయే ట్రైలర్ ని రెడీ చేస్తున్నారు..!

ఈ సంక్రాంతికి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు టాక్ బాగుంది అని వచ్చినా, సినిమా [more]

Update: 2019-02-11 07:48 GMT

ఈ సంక్రాంతికి భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. క్రిష్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు టాక్ బాగుంది అని వచ్చినా, సినిమా కలెక్షన్స్ మాత్రం చాలా డల్ గా వచ్చాయి. దీంతో ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇక రెండో భాగం మహానాయకుడు పొలిటికల్ డ్రామా కాబట్టి కచ్చితంగా హిట్ అవ్వాలని భావిస్తున్నారు. అందుకోసం క్రిష్ కొన్ని సీన్స్ రీషూట్ కూడా చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటివరకు ఈ సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా నటి విద్య బాలన్ తన ట్విట్టర్ అకౌంట్ లో ఫిబ్రవరి 22న రిలీజ్ అని ట్వీట్ చేసింది. అంతా ఓకే కానీ ఎన్టీఆర్ టీంకు అసలు సవాలు ఈ చిత్రం థియోటర్ ట్రైలర్.

డిస్ట్రిబ్యూటర్లకు ఫ్రీగా

మొదటి భాగం ఎఫెక్ట్ రెండో భాగంపై పడకుండా ఉండాలంటే ట్రైలర్ అదిరిపోవాలి. అందుకోసం గత కొద్ది రోజులుగా నాలుగు టీమ్ లు ట్రైలర్ ని రెడీ చేసే పనిలో ఉన్నాయట. వాటిలో రెండు డైరెక్టర్ క్రిష్ ఫైనల్ చేసి బాలయ్యకు పంపితే అందులో ఒకటి బాలయ్య ఫైనల్ చేస్తాడట. అంటే త్వరలోనే థియేట్రికల్ ట్రైలర్ ఉండబోతుంది అనమాట. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎన్.బి.కె ఫిల్మ్స్‌, వారాహి చలన చిత్రం, విబ్రి మీడియాలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మొదటి భాగం కొని నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ కే రెండో భాగం ఫ్రీగా అవ్వాలని డిసైడ్ అయ్యారు మేకర్స్.

Tags:    

Similar News