అయ్యో ఇదేమిటి మళ్ళీ?

Update: 2018-06-03 07:27 GMT

ఎన్టీఆర్ బయోపిక్ ని బాలకృష్ణ ఏమంటూ అనౌన్స్ చేసాడోగానీ అప్పటినుండి మొదలైంది రచ్చ. బాలయ్య అలా ఎన్టీఆర్ బయోపిక్ తీస్తానని చెప్పాడో లేదో.. రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ నానా రచ్చ చేసాడు. సరే వర్మ విషయం సర్దుమణిగింది అంటే... ఈ సినిమాకి దర్హకుడిగా పనిచేయాల్సిన తేజ ఉన్నట్టుండి ఎన్టీఆర్ బయోపిక్ నుండి బయటికి వచ్చేసాడు. బాలకృష్ణ తో పొసగలేదో ఏమో తెలియదు గాని తేజ మాత్రం ఎన్టీఆర్ బయోపిక్ ని చేయలేనని చెప్పేసాడు. ఇక బాలయ్య ఈ విష‌యంపై ఆలోచించి ఎన్టీఆర్ బయోపిక్ ని దర్శకుడు క్రిష్ చేతిలో పెట్టాడు.

క్రిష్ పై అనేక వార్త‌లు...

మరి గౌతమీపుత్ర శాతకర్ణి తో సూపర్ హిట్ ఇచ్చిన క్రిష్ కి ఎన్టీఆర్ బాధ్యతలను బాలయ్య అప్పగించాడు. ఇక క్రిష్ చేతుల్లోకి ఎన్టీఆర్ బయోపిక్ రావడంతో నందమూరి అభిమానులు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఒక పక్క ఎన్టీఆర్ బయోపిక్ స్క్రిప్ట్ పనులు ఇబ్బంది పెడుతుంటే... మరోపక్క దర్శకుడు క్రిష్ ఇప్పుడు పర్సనల్ గా కొన్ని ఇబ్బందులు పడుతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

జులై నెలాఖ‌రుకు....

మరి అటు ఎన్టీఆర్ బయోపిక్ గురించి ప్రకటన వెలువడిన తర్వాత లక్ష్మి పార్వతి ఆ సినిమాని విడుదల అవ్వ‌నివ్వ‌న‌ని శపధం చేసింది. ఇటు చూస్తే ఎన్టీఆర్ బయోపిక్ కి అనుకున్న దర్శకులు ఇబ్బందుల్లో పడుతున్నారు. మరి ప్రస్తుతం బాలకృష్ణ మాత్రం సైలెంట్ గా ఈ విషయాన్నీ పక్కన పెట్టేసి.. తన తదుపరి ప్రోజెక్టుల మీద మనసు పెడతాడా లేదంటే ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో సీరియస్ గా పనులు మొదలు పెడతాడా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. క్రిష్ దర్శ‌కత్వంలో ఎన్టీఆర్ బయో పిక్ జులై నెలాఖరు నుండి పట్టాలెక్కే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

Similar News