బాలయ్య - ఎన్టీఆర్ ఇంకా ఒక్కటవ్వలేదా..?

Update: 2018-10-22 06:26 GMT

బాలకృష్ణ - జూనియర్ ఎన్టీఆర్ గతంలో దూరం దూరంగా ఉన్నప్పటికీ.. జూనియర్ ఎన్టీఆర్ పెళ్లి సమయంలో బాలకృష్ణతో పాటు నందమూరి ఫ్యామిలీ మొత్తం ఒక్కతాటిపై నడిచింది. తర్వాత గత ఎనిమిదేళ్లుగా బాలకృష్ణ - జూనియర్ ఎన్టీఆర్ ఎడమొహం పెడమొహంగానే ఉంటున్నారు. కళ్యాణ్ రామ్ తో మంచి సన్నహిత సంబంధాలు మెయింటైన్ చేస్తున్న బాలయ్య ఎన్టీఆర్ ని మాత్రం దూరం పెట్టేసాడు. ఇక వీరు కలవరేమో అనుకుంటున్న సమయంలో హరికృష్ణ మరణం మళ్లీ నందమూరి ఫ్యామిలీని ఒక్క తాటిపైకి తెచ్చింది. బాలకృష్ణ కూడా పాత విషయాలు మరిచిపోయి అన్న మరణంతో వేదనలో ఉన్న కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ లను దగరికి తీసినట్లుగా కనబడేసరికి బాలయ్య మళ్లీ ఎన్టీఆర్ ని కలిపేసుకున్నాడన్నారు.

వేదికపైకి దగ్గరుండి తీసుకువచ్చినా...

ఇక ఎన్టీఆర్ ని బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ లో తీసుకుంటున్నాడని, ఎన్టీఆర్ అరవింద సమేత వేడుకలో బాబాయ్ అబ్బాయ్ లు ఒకే వేదిక మీద కనబడతారని రకరకాలుగా ప్రచారం జరిగినప్పటికీ.. బాలకృష్ణ మాత్రం సైలెంట్ గా ఎన్టీఆర్ బయోపిక్ షూట్ లో బిజీ అయ్యాడు. అయితే తాజాగా జరిగిన అరవింద సమేత సక్సెస్ మీట్ కి కళ్యాణ్ రామ్ కోరిక మేరకు బాలయ్య వచ్చాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ దగ్గరుండి బాబాయ్ ని వేడుకలోకి తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. మధ్యమధ్యలో ఎన్టీఆర్ తో బాలకృష్ణ గుసగుసలు చెప్పాడు. ఇవన్నీ చూసిన నందమూరి అభిమానుల సంబరం మాములుగా లేదు.

ఇంకా కలిసిపోలేదా..?

అయితే వేదిక మీద ఎన్టీఆర్, బాలకృష్ణ మాట్లాడిన మాటలు బట్టి చూస్తే మాత్రం ఎన్టీఆర్- బాలయ్యల మధ్య ఇంకా సంధి ఏర్పడలేదా..? అనిపిస్తుంది. ఎన్టీఆర్ తండ్రి లేని లోటు బాబాయ్ బాలయ్య తీరుస్తున్నాడని.. నాన్నగారి స్థానంలో బాబాయ్ ఈవెంట్ కి వచ్చాడని చాలా లైట్ గా మాట్లాడగా... బాలకృష్ణ కూడా అరవింద సమేత సినిమా చూడలేదని.. ఎన్టీఆర్ గురించి పొడిపొడిగా మాట్లాడి మిగతా అరవింద సమేత సినిమాకి పనిచేసిన టెక్నీకల్ టీం గురించి మాట్లాడాడు. మరి ఎన్టీఆర్, బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ ఒకే ఫ్రెమ్ లో ఉన్నప్పటికీ.. వారి మధ్యన ఇంకా ఎడతెగని బంధం ఏర్పడలేదనే అనుమానం మాత్రం వారి మాటలను బట్టి కలగకమానదు. ఇక నందమూరి అభిమానులు సర్దుకుపోయినా.. మిగతా వారు మాత్రం బాబాయ్ అబ్బాయ్ లు ఇంకా ఒక్కటవ్వలేదు అనేలా ఉంది.

Similar News