ఎన్టీఆర్ సినిమా కథల కహాని?

కరోనా కారణంగా ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేస్తున్న హీరోలంతా ఖాళీ సమయంలో కొంతమంది దర్శకుల కాంటాక్ట్ లోకి వెళ్లి ఫోన్ లో కథలు వింటున్నారట. ప్రస్తుతం [more]

Update: 2020-04-11 09:40 GMT

కరోనా కారణంగా ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేస్తున్న హీరోలంతా ఖాళీ సమయంలో కొంతమంది దర్శకుల కాంటాక్ట్ లోకి వెళ్లి ఫోన్ లో కథలు వింటున్నారట. ప్రస్తుతం RRR షూటింగ్ కి బ్రేకిచ్చి కరోనా లాక్ డౌన్ కి బందీ అయినా ఎన్టీఆర్… రామ్ చరణ్ పూర్తియిన రోజు స్పెషల్ వీడియో కోసం ఇంట్లో నుండే డబ్బింగ్ చెప్పాడు. అయితే RRR పనులు రాజమౌళి ఇంటి నుండే చూసుకుంటున్నాడు.. ఇక హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్రీ అయ్యారు. అయితే ఎన్టీఆర్ RRR తర్వాత సినిమాని త్రివిక్రమ్ తో కమిట్ అవగా.. తదుపరి సినిమా కోసం ఇప్పుడు కథలు వింటున్నాడనే టాక్ వినబడుతుంది.

ఎన్టీఆర్ తన 31 వ సినిమా కోసం దర్శకులకు కథలు చెప్పమని అడిగాడని.. దానికోసం కన్నడనుండి ప్రశాంత్ నీల్, ఇటు తెలుగు నుండి కొరటాల, తమిళం నుండి అట్లీ లైన్ లోకొచ్చారనే టాక్ వినబడుతుంది. అయితే ఎన్టీఆర్ తనకి చెప్పే కథకి పాన్ ఇండియా అప్పీల్ ఉండాలని.. ఈ సినిమా ఇండియా వైడ్ గా తెరకెక్కాలనే కండీషన్స్ పెడుతున్నాడట. ఇక ఏ దర్శకుడు తన ఇమేజ్ కి తగ్గట్టుగా పాన్ ఇండియా కథ వినిపిస్తే ఆ డైరెక్టర్ కే ఎన్టీఆర్ కమిట్ అవుతాడట. మరి ప్రస్తుతం ఫ్యామిలీ తో ఎన్టీఆర్ టైం స్పెండ్ చేస్తూనే ఇటు తదుపరి సినిమా కోసం కథలు వింటున్నాడనే కహాని ఎంతవరకు నిజమనేది తెలియదు.

Tags:    

Similar News