బ్రేకింగ్: 'ఎన్టీఆర్' కి నోటీసులు

Update: 2018-06-28 10:01 GMT

ఇంకా ఎన్టీఆర్ బయోపిక్ పట్టాలెక్కకముందే... ఆదిలోనే హంస పాదు అన్నట్లుగా దర్శకుడిగా పనిచేస్తున్న క్రిష్ కి, నందమూరి బాలకృష్ణ కి ఎన్టీఆర్ బయోపిక్ కి వ్యతిరేకంగా కొందరు నోటీసులు పంపడం ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో, పొలిటికల్ గా హాట్ టాపిక్ అయ్యింది. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా తెరకెక్కనున్న ఎన్టీఆర్ బయోపిక్ మరికొద్ది రోజుల్లోనే సెట్స్ మీదకెళ్లబోతుంది. ఈ లోపు స్క్రిప్ట్ వర్క్ పనులతో పాటుగా క్రిష్ నటీనటుల ఎంపికపై దృష్టి సారించాడు. అయితే ఇంకా ఎన్టీఆర్ బయోపిక్ ని అధికారికంగా మొదలు పెట్టకముందే క్రిష్, బాలకృష్ణ లు నోటీసులు అందుకున్నారు. అది కూడా ఎన్టీఆర్ తో సన్నిహితం గా మెలిగి తర్వాత విరోధిగా మారిన నాదెండ్ల భాస్కర్ రావు కుటుంబం నుంచి. ఎన్టీఆర్ బయోపిక్ లో తమ తండ్రి పాత్రని నెగటివ్ గా చూపించబోతున్నట్లుగా తెలిసిందని, ఈ సినిమా విషయంలో తమని ఎవరూ సంప్రదించకుండా తెరకెక్కిస్తున్నారని.. నాదెండ్ల భాస్కర్ రావు కుటుంబం దర్శకుడు క్రిష్ కి, బాలకృష్ణ కి విడివిడిగా నోటీసులు పంపినట్లుగా తెలుస్తుంది.

నాదెళ్ల కుటుంబం భయం ఇదే...

మరి నాదెండ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ నుండి తెలుగు దేశం లోకి రావడం.. ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా మెలగడం.. తర్వాత ఎన్టీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అండదండలతో ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి సీఎం కూర్చుని అధిరోహించడం వంటి విషయాలు అందరికి తెలిసినవే. అయితే ఎన్టీఆర్ బయోపిక్ లో నాదెండ్ల భాస్కర్ రావుని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూపిస్తారేమో అని నాదెళ్ల కుటుంబం భయపడుతుంది. అందుకే ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో క్రిష్ కి, బాలయ్యకి కోర్టు నోటీసులు పంపింది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ అనే విషయం గత ఏడాది నుండి ప్రచారంలో ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఈ ఈ నోటీసు లు పంపడానికి గల కారణం.. దర్శకుడు క్రిష్ నాదెండ్ల భాస్కర్ రావు పాత్రకి బాలీవుడ్ నుండి సచిన్ కెడెకర్ ని ఎంపిక చెయ్యడం.. ఆయన ఎన్టీఆర్ బయోపిక్ లో నెగెటివ్ పాత్ర కోసమే తీసుకున్నట్లుగా ప్రచారం జరగడంతో... నాదెండ్ల కుటుంబం ఇలా నోటీసులు పంపింది అని టాక్.

Similar News