విజయ్ దేవరకొండ ' నోటా ' పబ్లిక్ మీట్..!

Update: 2018-10-01 06:31 GMT

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ నటించిన 'నోటా' అక్టోబర్ 5న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విజయ్ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేసాడు. అందులో భాగంగా విజయవాడలో పబ్లిక్ మీట్ ఏర్పాటు చేసి సినిమా రేంజ్ ని మరింత పెంచాడు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ, మెహ్రీన్ కౌర్ విచ్చేసి అభిమానులను ఉత్సాహపరిచారు. జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా కి ఆనంద్ శంకర్ దర్శకత్వం వహించాడు..

సినిమా.. రాజకీయం కలిసిన సినిమా..!

విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘‘రెండు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా విజయవాడలో అందరికీ ఇష్టమైన... సినిమా, రాజకీయం కలిపి వస్తున్న పవర్ ఫుల్ జబర్దస్త్ సినిమా నోటా.. ఈ సినిమా ద్వారా మీ అందరికి మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాని అందిస్తున్నామని చెప్తున్నాను.. ఇంకా నాలుగే రోజులు ఉంది. థియేటర్ లో కలుద్దాం.. చూద్దాం.. సినిమా ఎలా ఉంటుందో.. మంచి స్క్రిప్ట్ తో , పవర్ ఫుల్ డైలాగ్స్ తో వస్తున్న సినిమా నోటా..మా సినిమా ని అందరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను.’’ అని పేర్కొన్నారు. మెహ్రీన్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా రిలీజ్ కోసం చాలా వెయిట్ చేస్తున్నాను.. నేను అర్జున్ రెడ్డి ఫ్యాన్ ని.. విజయ్ దేవరకొండ తో నటించినందుకు చాల హ్యాపీ గా ఉంది. విజయ్ లాంటి హీరోను నిజంగా నేను ఇంత వరకు చూడలేదు. తెలుగు నా కన్నా తల్లి లాంటిది... తమిళ్ లో కూడా ఆదరిస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు..

Similar News