ప్రభాస్ ఫాన్స్ ని వాళ్లిద్దరూ మోసం చేసారు!!

ప్రభాస్ పుట్టిన రోజు వచ్చింది… రాధేశ్యాం హడావిడి సోషల్ మీడియాలో దున్నేసింది. ప్రభాస్ విక్రమాదిత్య వింటేజ్ లుక్, పూజ హెగ్డే తో ట్రైన్ లో రొమాంటిక్ లుక్ [more]

Update: 2020-10-25 03:19 GMT

ప్రభాస్ పుట్టిన రోజు వచ్చింది… రాధేశ్యాం హడావిడి సోషల్ మీడియాలో దున్నేసింది. ప్రభాస్ విక్రమాదిత్య వింటేజ్ లుక్, పూజ హెగ్డే తో ట్రైన్ లో రొమాంటిక్ లుక్ తో ప్రభాస్ రాధేశ్యాం సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. రాధేశ్యాం టీం ఇప్పటివరకు సైలెంట్ గా ఉంది.. ఇక ప్రభాస్ పుట్టిన రోజు నుండి సినిమాపై క్రేజ్ పెంచాలనే టీం ఆలోచన పర్ఫెక్ట్ గా సక్సెస్ అయినట్లుగానే కనబడుతుంది. ఇక ప్రభాస్ పుట్టిన రోజునాడు మరో ఇద్దరు దర్శకులు ప్రభాస్ ఫాన్స్ ని మోసం చేసారు. వాళ్ళే నాగ్ అశ్విన్, ఓం రనౌత్ లు. వాళ్ళేం.. మోసం చేశారంటారా..

నాగ శ్విన్ సినిమా ప్రభాస్ తో అనౌన్స్ చేసాక కొన్ని రోజులకే దీపికా పదుకొనేని హీరోయిన్ గా పరిచయం చేసాడు. అలాగే ప్రభాస్ పుట్టిన రోజు కన్నా ముందే అంటే ఓ వారం ముందే ప్రభాస్ – దీపికా కాంబోలో నాగ శ్విన్ మూవీలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ ఓ కీలక పాత్ర చేస్తున్నట్లుగా ప్రకటించి.. పుట్టిన రోజునాడు ఎలాంటి అప్ డేట్ లేకుండా ఉసూరుమనిపించాడు. ఇక బాలీవుడ్ దర్శకుడు ఓం రనౌత్ కూడా ప్రభాస్ తో ఆదిపురుష్ ని హడావిడి గా గ్రాండ్ గా ప్రకటించాడు. అలాగే కొన్ని రోజుల్లోనే ఆదిపురుష్ లో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ని పరిచయం చేసాడు. కానీ ప్రభాస్ పుట్టిన రోజునాడు ఓం రనౌత్ ఆదిపురుష్ అప్ డేట్ ఇస్తాడేమో.. హీరోయిన్ ని ఏమైనా పరిచయం చేస్తాడేమో అని అనుకుంటే.. ఓం రనౌత్ కూడా ఫాన్స్ కి హ్యాండ్ ఇచ్చాడు.

 ఇక ప్రభాస్ పుట్టిన రోజునాడు.. ఓం రనౌత్, నాగ్ అశ్విన్ లు ఇద్దరూ  సోషల్ మీడియాలో చాలా సింపుల్ గా ప్రభాస్ కి విషెస్ చెప్పి తప్పించుకున్నారు. మరి వాళ్ళది కూడా ఏం తప్పులేదు. ఫాన్స్ ని కావాలని మోసం చెయ్యలేదు. నాగ్ అశ్విన్ కానీ ఓం రనౌత్ కానీ ప్రభాస్ తో సినిమా షూటింగ్స్ మొదలు పెట్టకుండా ఆ సినిమా ఫస్ట్ లుక్ కానీ. టీజర్ కానీ, నాగ శ్వి టైటిల్ కానీ చెప్పలేరు. అందుకే  ప్రభాస్ పుట్టిన రోజునాడు ఆ ఇద్దరు దర్శకులు ప్రభాస్ లుక్స్ ని విడుదల చెయ్యలేకపోయారంతే. 

Tags:    

Similar News