నీ క్రేజ్ సరిపోతుందా… అర్జునా?

ఈ ఏడాది మొదలవడమే పెద్ద సినిమాల హంగామా తో మొదలు కానుంది. 2020 లో బడా సినిమాల జాతర సంక్రాంతికే మొదలయ్యింది. రజినీకాంత్ దర్బార్ జనవరి 3 [more]

Update: 2019-12-31 06:19 GMT

ఈ ఏడాది మొదలవడమే పెద్ద సినిమాల హంగామా తో మొదలు కానుంది. 2020 లో బడా సినిమాల జాతర సంక్రాంతికే మొదలయ్యింది. రజినీకాంత్ దర్బార్ జనవరి 3 న భారీగా పెద్ద ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహిస్తుంటే.. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ నడిబొడ్డున స్టేడియం లో చిరు ముఖ్య అతిధిగా జనవరి 5 న నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నాడు. ఇక అల్లు అర్జున్ అయితే యూసుఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో జనవరి 6 న అల వైకుంఠపురములో మ్యూజికల్ ఈవెంట్ ని ఘనంగా చెయ్యబోతున్నాడు. అయితే మహేష్ బాబు చిరు ని గెస్ట్ గా పిలిసిస్తే అల్లు అర్జునేమో… ఎన్టీఆర్ కానీ, రామ్ చరణ్ ని కానీ పవన్ కళ్యాణ్ ని కానీ గెస్ట్ గా పిలుస్తాడని అనుకున్నారు మెగా ఫ్యాన్స్.

అయితే తాజాగా అల్లు అర్జున్ ఈసారి తన ఈవెంట్ కోసం ఎవ్వరిని ఇన్వైట్ చెయ్యడం లేదని ఎన్టీఆర్ ని పిలుద్దామనుకున్నా ఎన్టీఆర్ పర్సనల్ కారణాలతో ఉన్నాడని, ఇక చెర్రీ ని ఎందుకులే అనుకున్నాడో ఏమో.. పవన్ కళ్యాణ్ విషయాన్నీ అల్లు అర్జున్ ఆలోచించడం లేదని..పాటలు హిట్ అవడంతో.. కేవలం తన క్రేజ్ తోనే, సినిమా మీద హైప్ క్రియేట్ అయినట్లుగా.. ఆ మ్యూజికల్ ఈవెంటుని కూడా ఓ రేంజ్ లో నడిపించాలని డిసైడ్ అయినట్లుగా వార్తలొస్తున్నాయి. ఒకవేళ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో కోసం గెస్ట్ గాఎవరినైనా పిలుస్తాడనుకుంటే.. ఆ విషయాన్నీ ఈవెంట్ జరగబోయే తేదీతో పాటే ప్రకటించేవాడు.. కాని ఈసారి కేవలం త్రివిక్రమ్ క్రేజ్, తన క్రేజ్ ఈ సినిమాకి సరిపోతుందని అల్లు అర్జున్ భావించబట్టే.. తన ఈవెంట్ ని సింగిల్ హ్యాండ్ తో చెయ్యాలని డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. మరోపక్క మహెష్ చిరు లాంటి భారీ సెలెబ్రిటీని గెస్ట్ గా పిలుస్తుంటే.. తమ హీరో మాత్రం ఇలా సింపుల్ గా ఈవెంట్ ని కానిచ్చేయడం మెగా అభిమనులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక పాటలకొచ్చిన క్రేజ్ తో ఈవెంట్ ని సక్సెస్ చేస్తారని అల్లు అర్జున్ కూడా ఫ్యాన్స్ నే నమ్ముకున్నాడు.

Tags:    

Similar News