పింక్ రీమేక్ ముచ్చట్లకు బ్రేక్

పవన్ కళ్యాణ్ రాజకీయాలనుండి ఒక్కసారిగా సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. సినిమా షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటున్నాడో కూడా ఎవ్వరికి తెలియకుండా జాగ్రత్తపడుతున్నాడు పవన్. ఎక్కువగా రాజకీయాలతో మీడియాలో [more]

Update: 2020-02-21 06:34 GMT

పవన్ కళ్యాణ్ రాజకీయాలనుండి ఒక్కసారిగా సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. సినిమా షూటింగ్ లో ఎప్పుడు పాల్గొంటున్నాడో కూడా ఎవ్వరికి తెలియకుండా జాగ్రత్తపడుతున్నాడు పవన్. ఎక్కువగా రాజకీయాలతో మీడియాలో ఫోకస్ అవుతున్నాడు. అయితే పవన్ కళ్యాణ్ డబ్బు కోసమే సినిమాలు చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నాడు. అందుకే అర్ధం పర్ధం లేని పింక్ రీమేక్ ని ఒప్పుకున్నాడు. త్రివిక్రమ్ చెప్పాడని, దిల్ రాజు పింక్ రీమేక్ ని పవన్ కళ్యాణ్ తో ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు ఆ సినిమాని రీమేక్ చేసి పవన్ క్రేజ్ తగ్గించుకోబోతున్నాడనే ప్రచారం జరుగుతుంది.

పవన్ పింక్ రీమేక్ షూటింగ్ తో పాటుగా క్రిష్ సినిమాని చేస్తున్నాడు. మరోపక్క హరీష్ తో మరో మూవీ ని లైన్ లో పెట్టాడు. అయితే పవన్ మల్లి సినిమాల్లోకి వచ్చినప్పుడు అంతగా పబ్లిసిటీ లేదు. కానీ మధ్యలో పవన్ ఫ్యాన్స్ హంగామా చేసారు. పింక్ రీమేక్ అనగానే ఉత్సాహం నీరుగారిపోయింది. అయితే మధ్యలో దిల్ రాజు ఫ్లైట్, పవన్ పారితోషకం అంటూ పింక్ ముచ్చట్లు మీడియాలో తెగ హల్చల్ చేసాయి. కానీ తాజాగా పవన్ – క్రిష్ కాంబో మూవీ పై వస్తున్న వార్తల్లో ఒక్క వంతు కూడా పింక్ రీమేక్ పై మీడియాలో వార్తలు రావడం లేదు. మరోపక్క జానూ రీమేక్ చేసి చేతులు కాల్చుకున్న దిల్ రాజుకి పింక్ రీమేక్ తోనూ బ్యాండ్ తప్పదని ప్రచారం జరుగుతుంది. మరోపక్క పవన్ పింక్ రీమేక్ పబ్లిసిటీ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది అని ఫ్యాన్స్ కూడా లైట్ తీసుకోవడంతో సోషల్ మీడియాలో పింక్ రీమేక్ ముచ్చట్లకు ఫుల్ స్టాప్ పడింది.

Tags:    

Similar News