కరోనా అయినా తగ్గవా?

కరోనా కారణంగా అందరూ పారితోషకాలు తగ్గించుకుంటుంటే.. పూజ హెగ్డే మాత్రం పారితోషకం పెంచేసింది అనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. కరోనా కారణంగా నిర్మాతలు [more]

Update: 2020-07-29 05:38 GMT

కరోనా కారణంగా అందరూ పారితోషకాలు తగ్గించుకుంటుంటే.. పూజ హెగ్డే మాత్రం పారితోషకం పెంచేసింది అనే వార్త ఇప్పుడు టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. కరోనా కారణంగా నిర్మాతలు నిండా మునగడంతో హీరో, హీరోయిన్స్ మొత్తం పారితోషకాలు తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉన్నట్లుగా టాలీవుడ్ పెద్దలే చెబుతున్నారు. అయినప్పటికీ పూజ హెగ్డే పారితోషకం విషయం ఇప్పుడు ఇంతగా హైలెట్ అవడం మాత్రం నిజంగా ఆమెకి యాంటీ అయినా కావొచ్చు. అయితే పూజ హెగ్డే నాకు అల వైకుంఠపురములో లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఉంది.. ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ మూవీ ఉంది అందుకే నేను పెంచుతాను అన్నట్టుగా ఉందట పూజ వ్యవహారం.

బెల్లంకొండ తో చేసిన సినిమాకి కోటిన్నర తీసుకున్న పూజ అలా వైకుంఠపురములో కి 1.4 కోట్లు తీసుకుందట. ఇప్పుడు 2 కోట్లు డిమాండ్ చేస్తున్నదట. అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో పాటుగా ప్రభాస్ రాధే శ్యాం తర్వాత సినిమాలు లేని పూజ కి ఈ రేంజ్ పారితోషకాలు అనేది కరోనా టైం లో ఇవ్వడం అనేది కుదిరే పనేనా. జస్ట్ గ్లామర్ తప్ప నటనలో వీక్ అయిన పూజ హెగ్డే కి ఎంత లక్కుంటే మాత్రం అంతలా పారితోషకాలు అడిగింది ఇవ్వడానికి ప్రస్తుతం మాములు విషయం కాదు. అయినా ప్రసుతం పూజ ని ఎవరు సంప్రదిస్తే..వాళ్లకి 2 కోట్లు చెప్పిందో కానీ… ఇప్పుడు ఈ విషయం మాత్రం బాగా హైలెట్ అయ్యింది.

Tags:    

Similar News