మహేష్ కి ఇంకెవరూ సెట్ కాలేదట!!

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. వంశి పైడిపల్లి సినిమా చెయ్యాల్సిన మహేష్ ఆ సినిమాని ఆపేసాడు. ఈలోపు పరశురామ్ తో [more]

Update: 2020-04-04 07:31 GMT

మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ సినిమా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. వంశి పైడిపల్లి సినిమా చెయ్యాల్సిన మహేష్ ఆ సినిమాని ఆపేసాడు. ఈలోపు పరశురామ్ తో మహేష్ సినిమా అంటూ న్యూస్ వచ్చింది. అయితే ప్రస్తుతం కరోనా కారణంగా ఇంట్లోనే గడుపుతున్న మహేష్ బాబు తన కొడుకు గౌతమ్, సితార లతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ కరోనా టైం ని డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో సినిమాలు చూస్తూ ఫ్యామిలీతో గడుపుతున్న మహేష్ బాబు పరశురామ్ కి ఫోన్ చేసి.. కంగారేం లేదు.. కూల్ గా స్క్రిప్ట్ రెడీ చెయ్యమని చెప్పినట్లుగా తెలుస్తుంది.

ఇక మహేష్ బాబు కి పరశురామ్ సినిమాలో ఓ బాలీవుడ్ భామ నటించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. పరశురామ్ లక్కీ హీరోయిన్ రశ్మికని పరశురామ్ సజెస్ట్ చేస్తే.. ఇప్పుడే సరిలేరు లో నటించా ఇక వద్దని మహేష్ చెప్పగా.. పరశురామ్ మహేష్ కోసం బాలీవుడ్ భామని తీస్కుంటున్నాడని, కాదు మహానటి కీర్తి సురేష్ ని ఎంపిక చేస్తున్నారని. స్వయానా కీర్తి సురేష్ ని మహేష్ సజెస్ట్ చేసాడని అన్నారు. అయితే ఇంతవరకు మహేష్ కోసం పరశురామ్ హీరోయిన్ సెట్ చెయ్యలేదని.. మహేష్ సినిమా కోసం డైలాగ్ వెర్షన్ తో బిజీగా ఉన్నాడని, అది పూర్తయ్యాక మహేష్ కి పూర్తి స్క్రిప్ట్ నేరేట్ చేశాకే నటీనటులు, హీరోయిన్ ఎంపిక మొదలెడతారని పరశురామ్ సన్నిహితుల సమాచారం. అయితే మహేష్ మాత్రం ఎంత టైం అయినా తీసుకో..కానీ పని పర్ఫెక్ట్ గా ఉండాలని చెబుతున్నాడట.

Tags:    

Similar News