రౌడీ గారెక్కడ ఫాన్స్ వెతుకులాట!!

కరోనా అంటూ తెలంగాణ ప్రభుత్వం కాస్త త్వరపడగానే రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా లోకొచ్చి కరోనా తో కంగారు పడకండి.. చేతులని శుభ్రంగా కడుక్కోండి. [more]

Update: 2020-04-01 06:14 GMT

కరోనా అంటూ తెలంగాణ ప్రభుత్వం కాస్త త్వరపడగానే రౌడీ హీరో విజయ్ దేవరకొండ సోషల్ మీడియా లోకొచ్చి కరోనా తో కంగారు పడకండి.. చేతులని శుభ్రంగా కడుక్కోండి. సామజిక దూరం పాటించండి అంటూ నీతులు వల్లించాడు. కానీ కరోనా బధితులకి రూపాయి కూడా విరాళం ఇవ్వలేదు. యంగ్ ఎరోస్ అంతా తలో 20 లక్షలు విరాళం ఇవ్వగా… స్టార్ హీరోలు తమ రేంజ్ విరాళాలిచ్చారు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, శర్వానంద్, సాయి ధరమ్ తేజ్, నితిన్, వరుణ్, నిఖిల్ ఇలా ఎవరికీ వారే కరోనా కి విరాళాలిచ్చారు.

ప్రస్తుతం పూరి జగన్నాధ్ తో పాన్ ఇండియా ఫిలిం లో నటిస్తున్న విజయ్ దేవరకొండ కనీసం క్రేజ్ కోసం అయినా విజయ్ దేవరకొండ విరాళం ఇవ్వాల్సింది. పాన్ ఇండియా మూవీ అంటే అందరూ విజయ్ సినిమా గురించే మాట్లాడాలి. ఇలాంటి టైం లో కరొనకి భారీ విరాళమిస్తే విజయ్ దేవరకొండ మీదే అందరి చూపు ఉండేది. అలాగే అందరూ మట్లాడుకునేవారు. కానీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఎక్కడా కనిపించడం లేదు. కనీసం నా వంతు సహాయం ఇది అని చెప్పలేదు. బయటికి రాకపోయినా.. విరాళం ప్రకటించడానికి విజయ్ కి టైం లేదా అంటున్నారు చాలామంది. అందుకే సోషల్ మీడియాలో రౌడీ స్టార్ ఎక్కడ బాబు.. అంటూ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ వెతుకులాడుతున్నారట.–

Tags:    

Similar News