ప్రభాస్ కోసం వెనక్కి తగ్గమంటున్నారే!!

ప్రభాస్ బాహుబలి తర్వాత పాన్ ఇండియా లెవెల్ స్క్రిప్ట్స్ కె మొగ్గు చూపుతున్నాడు. చిన్న చితక సినిమాలను, సౌత్ సినిమాలను చెయ్యనంటున్నాడు. కాబట్టే బాహుబలి తర్వాత సాహో [more]

Update: 2020-09-27 01:47 GMT

ప్రభాస్ బాహుబలి తర్వాత పాన్ ఇండియా లెవెల్ స్క్రిప్ట్స్ కె మొగ్గు చూపుతున్నాడు. చిన్న చితక సినిమాలను, సౌత్ సినిమాలను చెయ్యనంటున్నాడు. కాబట్టే బాహుబలి తర్వాత సాహో చేసాడు. తర్వాత రాధాకృష్ణ తో రాధేశ్యాం చేస్తున్నాడు. కరోనా తర్వాత రాధేశ్యాం షూటింగ్ అక్టోబర్ నుండి మొదలు కాబోతుంది.ఇటలీ లో షూటింగ్ చేసేందుకు రాధేశ్యాం టీం రెడీ అవుతుంది. అయితే ప్రభాస్ మళ్ళీ పాన్ ఇండియా గా నాగ్ అశ్విన్ మూవీ, అలాగే బాలీవుడ్ డైరెక్టర్ తో భారీ బడ్జెట్ తో ఆదిపురుష్ మూవీలను లైన్ లో పెట్టాడు. దీనితో ప్రభాస్ సౌత్ సినిమాలు చెయ్యడనిఫిక్స్ అయ్యారు. అయితే ఓం రనౌత్ ప్రభాస్ తో చెయ్యబోయే ఆదిపురుష్ ఏర్పాట్లు ఎప్పుడో మొదలుపెట్టాడు.

అందుకు తగ్గట్టుగా టి సీరీస్ వారు ఆదిపురుష్ బడ్జెట్ వేశారు. కరోనా వలన బడ్జెట్ కంట్రోల్ అంటున్నప్పటికీ… ప్రభాస్ కోసం టి సీరీస్ నిర్మాతలు తగ్గేదే లేదంటున్నారట. ఓం రనౌత్ నువ్ బడ్జెట్ వెయ్యి మేము అమలు చేస్తాం.. ఎక్కువైనా అభ్యంతరం లేదని ఓం రనౌత్ ని ప్రభాస్ ఆదిపురుష్ కోసం ఎంకరేజ్ చేస్తునట్లుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. భారీ విజువల్స్ తో కూడుకున్నచిత్రం కావడంతో ఈ చిత్రానికి భారీ ఖర్చు చేయడానికి నిర్మాణ సంస్థ టి సిరీస్ వెనుకాడడం లేదట. అవుట్ ఫుట్ బాగా రావాలంటే భారీగా పెట్టాల్సిందే అంటున్నారట. తారల రెమ్యునరేషన్ దగ్గరనుండి.. ప్యాచ్ వర్క్ వరకు ఎక్కడ తగ్గేది లేదని… ఎన్ని సెట్స్ కావాలంటే అన్ని వెయ్యమని ఓం రనౌత్ కి భరోసా ఇస్తున్నారట నిర్మాతలు. అంటే ప్రభాస్ కోసం ఎక్కడా తగ్గేదేలేదని అంటున్నారన్నమాట.

Tags:    

Similar News