విలన్ గా చెయ్యాలని ఉంది అంటున్న హీరోయిన్?

జెంటిల్మన్ లో నానికి జోడిగా వన్ అఫ్ ద హీరోయిన్ గాను, జై లవ కుశ లో ఎన్టీఆర్ సరసన వన్ అఫ్ ద హీరోయిన్ గాను, [more]

Update: 2020-02-17 11:00 GMT

జెంటిల్మన్ లో నానికి జోడిగా వన్ అఫ్ ద హీరోయిన్ గాను, జై లవ కుశ లో ఎన్టీఆర్ సరసన వన్ అఫ్ ద హీరోయిన్ గాను, కళ్యాణ్ రామ్ 118 లో వన్ అఫ్ ద హీరోయిన్ గా నటించి అందరి మనసులను దోచేసిన నివేత థామస్ రజినీకాంత్ కి కూతురుగా దర్బార్ సినిమాలో నటించింది. నయనతార హీరోయిన్ అయినా… అందరి చూపు నివేత థామస్ పాత్రపైనే. అయితే హీరోయిన్ గా నటిస్తున్న మీకు ఒక తండ్రికి కూతురుగా నటించడం ఎలా అనిపించింది అని అడగగా… రజిని సర్ సినిమా అంటేనే చాలా థ్రిల్ గా అనిపించింది. ఇక అయన కూతురుగా అంటే ఇంకా ఇంట్రెస్ట్ కలిగింది. అయితే నాకు మాత్రం ఓ లేడి విలన్ లా నటించాలనే కోరిక ఉంది అంటూ.. ఓ వెరైటీ కోరిక బయట పెట్టింది.

విలన్ గా నటిస్తే చాలా బావుంటుంది అని… అలాంటి పాత్రలు చేస్తే భలేగా ఉంటుంది, భలే లోచనలు వస్తాయి అంటుంది. అలాగే ఇప్పటివరకు నివేత థామస్ అంటే అందమైన అమ్మాయి, చలాకి అమ్మాయి, మంచి అమ్మాయిగానే చూస్తున్నారు. కానీ రొటీన్ కి కాస్త భిన్నంగా చెడ్డ అమ్మాయిగా అందరూ ద్వేషించే అమ్మాయిగా నటిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వస్తుంది అని చెబుతుంది ఈ పొట్టి పిల్ల. అందం అభినయం ఆమె సొంతం. అయినా నివేత హైట్ వలన ఆమెకి స్టార్ ఛాన్సెస్ రావడం లేదు. ఇక హీరోయిన్ కాకపోయినట్లయితే.. పిహెచిడి చేసి టీచర్ అయ్యేదాన్ని అని, అసలు అర్కిటిక్ట్ చెయ్యాలని అనుకున్న అని… అందులో డిగ్రీ పూర్తి చేశా అని చెబుతుంది నివేత థామస్.

Tags:    

Similar News