సావిత్రి పాత్రలో కీర్తి కాదు..మరి ఎవరు?

Update: 2018-09-23 08:50 GMT

'మహానటి' సినిమాలో కొన్ని పాత్రల్లో నటించిన కొంతమంది నటీనటులు ఎవర్నీ 'ఎన్టీఆర్' బయోపిక్ లో రిపీట్ చేయడకూడని క్రిష్ భావిస్తున్నాడు. అందుకే అక్కినేని నాగేశ్వరరావు పాత్ర లో నాగ చైతన్యకి బదులు సుమంత్ ను తీసుకున్నాడు క్రిష్. ఇప్పుడు అలానే ఇంకో పాత్రను రీప్లేస్ చేస్తున్నాడు డైరెక్టర్ క్రిష్. రిపీట్ చేస్తే ఆ సినిమాను ఈసినిమాను పోలుస్తారని అందుకే ఆ నటీనటులును రిపీట్ చేయట్లేదని తెలుస్తుంది. 'మహానటి'లో సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఎన్టీఆర్ లో ఆమెకి బదులు మలయాళీ హీరోయిన్ నిత్యామీనన్ ను తీసుకుంద్దాం అనుకుంటున్నారట టీం. అందుకోసం ఆమెను సంప్రదించారు క్రిష్. తన పాత్ర ఛాలెంజింగ్ గా ఉండటంతో ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే ఏస్ చెప్పేసిందట. మరి 'మహానటి' సినిమాలో కీర్తి సురేష్ ని చూసిన తర్వాత మళ్లీ ఆమె పాత్రలో ఇంకో హీరోయిన్ కి చూడటం అంటే కొంచం కష్టమే ఐన క్రిష్ ఏదోకటి మాయ చేస్తాడని నమ్మకంతో ఉన్నారు ప్రేక్షకులు. నిత్య అయితే సావిత్రి పాత్రకు న్యాయం చేస్తుందని భావిస్తున్నాడు క్రిష్.

మరోవైపు 'ఎన్టీఆర్' లో శ్రీదేవి పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్ ని కలిసినట్టు సమాచారం. మరి ఆమె ఆ పాత్ర చేయడానికి ఏస్ చెప్పిందో నో చెప్పిందో మరి కొన్ని రోజుల్లో తెలియనుంది. రోజురోజుకి కాస్టింగ్ తోనే సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు టీం. ఇక ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య, బసవతారకం పాత్రలో విద్య బాలన్, చంద్రబాబు పాత్రలో రానా నటిస్తున్న విషయం తెలిసిందే.

Similar News