ఇక నితిన్ ని ఎవరూ ఆపలేరు

మూడు వరస డిజాస్టర్స్ తో ఖంగుతిన్న నితిన్ మళ్ళీ పాత రోజులు గుర్తుకొచ్చాయనుకుంటా… అందుకే కొత్త సినిమాలు మొదలెట్టడానికి చాలా ఆలోచిస్తున్నాడు. గతంలో మాస్ మాస్ అంటూ [more]

Update: 2019-06-11 05:58 GMT

మూడు వరస డిజాస్టర్స్ తో ఖంగుతిన్న నితిన్ మళ్ళీ పాత రోజులు గుర్తుకొచ్చాయనుకుంటా… అందుకే కొత్త సినిమాలు మొదలెట్టడానికి చాలా ఆలోచిస్తున్నాడు. గతంలో మాస్ మాస్ అంటూ వరసగా నాలుగైదేళ్ళ ప్లాప్ లలోనే గడిపాడు. గత ఏడాది కూడా లై, శ్రీనివాస కళ్యాణం, ఛల్ మోహన రంగా ప్లాప్స్ తో మరో సినిమాని మొదలెట్టడానికి భయపడ్డాడు. మంచి స్క్రిప్ట్ తో నితిన్ ఏడెనిమిది నెలల గ్యాప్ తో భీష్మ సినిమాని దర్శకుడు వెంకీ కుడుములు దర్శకత్వంలో రేపు 12 న మొదలెట్టబోతున్నాడు. పక్కాగా స్క్రిప్ట్ తోనే ఈ సినిమాని పట్టాలెక్కించబోతున్నాడు. ఈ సినిమా లో నితిన్ తో కలిసి భారీ క్రేజ్ ఉన్న రష్మిక మందన్న నటించబోతుంది.

ఇక రెండో సినిమాని మిస్టర్ మజ్ను ప్లాప్ ఉన్నప్పటికీ..వెంకీ అట్లూరి కథ నచ్చి అతనితో మరో సినిమాని నితిన్ లైన్ లో పెట్టడమే కాదు.. ఆ సినిమాని త్వరలోనే మొదలెట్టవుతున్నాడు. ఇకపోతే వెంకీ కుడుములతో నితిన్ చెయ్యబోయే భీష్మ సినిమాని ఈ ఏడాది చివరిలోనే విడుదల చేసే ప్లాన్ లో మేకర్స్ ఉన్నారు. పక్కా స్క్రిప్ట్, నటీనటుల ఎంపిక, ప్రి ప్రొడక్షన్ కూడా పకడ్బందీగా జరిగిన ఈ భీష్మ సినిమాని ఎట్టి పరిస్తితుల్లో డిసెంబర్ 20 కల్లా పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు తెచ్చే యోచనలో ఉన్నారట. రెస్ట్ తీసుకున్న ఈ ఏడెనిమిది నెలల టైం ని ఇప్పుడు ఉన్న ఈ కొద్దీ సమయంలోనే అసలు రెస్ట్ అనేదే లేకుండా సినిమాని పూర్తి చెయ్యాలనే టార్గెట్ పెట్టుకున్నట్లుగా తెలుస్తుంది.

Tags:    

Similar News