రంగ్ దే కి భారీ ఆఫర్?

నితిన్ – కీర్తి సురేష్ కాంబోలో వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న రంగ్ దే షూటింగ్ త్వరలోనే పూర్తి కాబోతుంది. కరోనా అన్ని సినిమాలకు అడ్డం పడినట్లుగానే రంగ్ [more]

Update: 2020-09-18 06:23 GMT

నితిన్ – కీర్తి సురేష్ కాంబోలో వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న రంగ్ దే షూటింగ్ త్వరలోనే పూర్తి కాబోతుంది. కరోనా అన్ని సినిమాలకు అడ్డం పడినట్లుగానే రంగ్ దేకి కూడా అడ్డం పడింది. కొద్దిమేర షూటింగ్ బాలన్స్ ఉన్న టాంగ్ దే షూటింగ్ ని వెంకీ తాజాగా మొదలెట్టాడు. నితిన్ పెళ్లి తరవాత ఈ సినీమా షూటింగ్ లో పాల్గొనటం, పెళ్లి కి రంగ్ దే టీజర్ వదలడంతోసినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. నితిన్ కి భీష్మ హిట్ ఉండడం కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించడంతో ఈ సినిమాపై మొదటి నుండి అంచనాలు క్రియేట్ అయ్యాయి. అయితే ప్రస్తుతం థియేటర్స్ బంద్ వలన చాలా సినిమాలు ఓటిటి బాట పడుతున్నట్టు… ఓటిటి వారు భారీ డీల్స్ కి మీడియం రేంజ్ సినిమా లు కొనెయ్యడంతో.. ఇప్పుడు అందరిలో అనుమానాలు మొదలయ్యాయి. అంటే కొద్దిమేర షూటింగ్ బాలన్స్ ఉన్నవి త్వరగా పూర్తి చేసి ఓటిటికి అమ్మేస్తారంటున్నారు.

అయితే రంగ్ దే సినిమాని మేము ఓటిటికి అమ్మం… సంక్రాతి వరకు వెయిట్ చేస్తామని మూవీ టీం చెప్పడమే కాదు… టీజర్ లోకూడా వేసింది. అయితే తాజాగా ఓ ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ రంగ దే సినిమాకి 40 కోట్ల భారీ ఆఫర్ ఇచ్చినట్టుగా న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎంత భారీ డీల్ వచ్చినా మా సినిమాని థియేటర్స్ లోనే విడుదల చేస్తాము.. భీష్మ హిట్ తర్వాత నితిన్ క్రేజ్ పెరిగింది. ఇలాంటి టైం లో ఓటిటికి వెళితే క్రేజ్ మొత్తం పోతుంది అని…. ఎంతగా అంటే 40 కోట్లు ఇస్తానన్న మా సినిమాని ఓటిటికి అమ్మం.. మేము సంక్రాంతికే స్టిక్ అవుతామంటుందట రంగ్ దే టీం.

Tags:    

Similar News