నితిన్ వారినే టార్గెట్ చేశారా..?

హీరో నితిన్ కు ప్రస్తుతం హిట్ అనేది చాలా అవసరం. ‘ఛలో’ సినిమాతో సూపర్ హిట్ అందించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేస్తున్నాడు. [more]

Update: 2019-04-27 08:42 GMT

హీరో నితిన్ కు ప్రస్తుతం హిట్ అనేది చాలా అవసరం. ‘ఛలో’ సినిమాతో సూపర్ హిట్ అందించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి ‘భీష్మ’ అనే టైటిల్ కూడా పెట్టారు. ప్రస్తుతం నితిన్ ‘భీష్మ’ సినిమాకి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ స్టోరీ యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఉంటుందంటున్నారు. అలానే నితిన్ ‘భీష్మ’తో పాటు చంద్రశేఖర్ యేలేటితోనూ ఒక సినిమా చేయనున్నాడు.

అవయవదానం గురించి…

ఇది కూడా యూత్ కి కనెక్ట్ అయ్యే కథతోనే కొనసాగుతుందంట. అయితే ‘అవయవదానం’ ప్రాధాన్యతను గురించిన సందేశం కథలో అంతర్లీనంగా ఉంటుందని అంటున్నారు. కామెడీకి ఏ మాత్రం తగ్గకుండా డైరెక్టర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడని టాక్. ఇక ఈ మూవీ తరువాత నితిన్ కృష్ణచైతన్య దర్శకత్వంలోనూ ఓ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకు ఆల్రెడీ ‘పవర్ పేట’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. త్వరలోనే దీని గురించి డీటెయిల్స్ రానున్నాయి.

Tags:    

Similar News