నితిన్ కి క్లారిటీ లేదా..?

గత ఏడాది చూసిన డిజాస్టర్స్ తో ఖంగుతిన్న నితిన్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయమై మల్లగుల్లాలు పడుతున్నాడు. లై, ఛల్ మోహనరంగా, శ్రీనివాస కళ్యాణం సినిమాల [more]

Update: 2019-04-08 09:51 GMT

గత ఏడాది చూసిన డిజాస్టర్స్ తో ఖంగుతిన్న నితిన్ ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయమై మల్లగుల్లాలు పడుతున్నాడు. లై, ఛల్ మోహనరంగా, శ్రీనివాస కళ్యాణం సినిమాల దెబ్బకి మళ్లీ తన గత పదేళ్ల కెరీర్ రిపీట్ అవుతుందేమో అని నితిన్ కంగారు పడుతున్నాడు. అందుకే భీష్మ అంటూ ఫస్ట్ లుక్ విడుదల చేసినా వెంకీ కుడుములతో ధైర్యంగా సెట్స్ మీదకు వెళ్లలేకపోతున్నాడు. మరోపైపు ఫ్లాప్ డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి తోసినిమా అనౌన్స్ చేసాడు. ఇంతకీ ఆ సినిమా కూడా పట్టాలెక్కలేదు. అసలే ఐదుగురు హీరోలు రిజెక్ట్ చేసిన కథ అంటూ మీడియాలో న్యూస్ రావడంతో కంగారు పడిన నితిన్ ఇప్పుడు ఆ సినిమా విషయంలో ఛాన్స్ తీసుకోవడం ఆవరసమా అని ఆలోచనలో పడినట్లుగా చెబుతునారు.

ఏ సినిమాతో వస్తాడో…

అందుకే రోజుకో విషయంపై చంద్రశేఖర్ ఏలేటితో చర్చిస్తూ ఆ డైరెక్టర్ కి చమటలు పట్టిస్తున్నాడట. ఏ కథతో సెట్స్ మీదకు వెళ్లాలో నితిన్ కి అస్సలు క్లారిటీ రావడం లేదట. అందుకే ఇలా డైరెక్టర్స్ ని సెట్ చేసినా సినిమాని పట్టాలెక్కించలేకపోతున్నాడు. వరుసగా ఫ్లాప్ డైరెక్టర్స్ కి అవకాశాలిస్తూ నితిన్ వార్తల్లో అయితే నిలుస్తున్నాడు కానీ ఏ సినిమాతో ఎప్పుడు సెట్స్ మీద కనిపిస్తాడా అనేది నితిన్ కే క్లారిటీ లేనప్పుడు మిగతా జనాలకేం తెలుస్తుందిలే అంటూ సోషల్ మీడియాలో సెటైర్స్ కూడా పడుతున్నాయి. మరి నితిన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ తో పట్టాలెక్కే వరకు నితిన్ కి ఈ ట్రోలింగ్ తప్పేలా లేదు.

Tags:    

Similar News