నితిన్ బయోపిక్ చేయడానికి రెడీ..!

Update: 2018-08-10 07:57 GMT

తన గత రెండు సినిమాలు అనుకున్న స్థాయిలో ఆడలేదు. నితిన్ నటించిన లాస్ట్ మూవీస్ “లై” , “చల్ మోహన్ రంగా” బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ ఫ్లాప్స్ గా నిలిచాయి. ఇక నిన్న రిలీజ్ అయిన “శ్రీనివాస కళ్యాణం” తో ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా దగ్గర అవుదాం అని ప్రయత్నించాడు కానీ ఇది కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాపడే అవకాశం లేకపోలేదు. దీంతో, నితిన్ ఏదన్నా బయోపిక్ చేద్దాం అని అనుకుంటున్నాడట.

బయోపిక్ ల హవా నడుస్తుండటంతో...

ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో బియోపిక్స్ హవా నడుస్తుంది. లేటెస్ట్ గా అక్కడ 'సంజు' ఎంత సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుందో వేరే చెప్పనవసరం లేదు. అలానే మన తెలుగులో మహానటి సావిత్రి జీవిత కథతో రూపొందించిన 'మహానటి' సినిమాకు కూడా మంచి కలెక్షన్స్ వచ్చాయి. అందుకే నితిన్ ఏదన్నా బయోపిక్ చేస్తే సేఫ్ అని ఆలోచిస్తున్నాడట. అతని దగ్గరకు ఎవరన్నా వచ్చి బయోపిక్ స్టోరీ చెప్పితే ఒప్పుకోవడానికి రెడీ గా ఉన్నాడట. మరి నితిన్ కు సెట్ అయ్యే బయోపిక్ ని ఎవరు తీసుకొని వస్తారో చూడాలి.

Similar News